Alekhya Reddy: ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా ప్రేమికుల దినోత్సవానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి కూడా తన భర్త తారకరత్న గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
సినీ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్నటువంటి ఈయన ఉన్నఫలంగా గుండెపోటుకు గురయ్యారు. దాదాపు 20 రోజులకు పైగా హాస్పిటల్ లో చికిత్స పొందినటువంటి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.
ఇలా తన భర్త మరణించినప్పటికీ ఈమె తరచు తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూ వచ్చారు. తాజాగా వాలెంటైజ్ డే సందర్భంగా అలేఖ్యరెడ్డి షేర్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది. ఒక ఫ్లవర్ బొకే తీసుకెళ్లి తారకరత్న ఫోటో వద్ద పెట్టడమే కాకుండా తారకరత్న ఫోటోకి ముద్దు పెడుతూ ఆ ఫోటోని హగ్ చేసుకున్నారు.
వాలెంటైన్స్ డే ఓబు..
ఇకపోతే తన ముగ్గురు పిల్లలు కూడా తారకరత్న ఫోటో వద్ద ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే ఓబు అంటూ ఈమె తారకరత్నను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఇలా తారకరత్నను అలేఖ్య రెడ్డి ఎంతో మిస్ అవుతున్నారనే చెప్పాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…