ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏడు పదుల వయస్సులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే నవ్వు తెప్పిస్తూ ఉండటం గమనార్హం. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు 2022 సంవత్సరంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అమలాపురం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగం అమలవుతోందని.. జగన్ రాష్ట్రాన్ని పాలించలేక చేతులెత్తేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జగన్ వర్గం న్యాయ వ్యవస్థనే అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని.. కోర్టులపై సైతం విమర్శలు చేస్తోందని అన్నారు. జగన్ కేంద్రంతో కేసుల మాఫీ కోసమే సన్నిహితంగా మెలుగుతున్నారని వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయల సంపద అయిన అమరావతిని జగన్ సర్కార్ విధ్వంసం చేసిందని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపులకు రిజర్వేషన్ తెచ్చిందని అయితే.. వాళ్లకు జగన్ రిజర్వేషన్ ఇవ్వట్లేదని అన్నారు.
జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బీసీలలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను సైతం జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ కు భవిష్యత్తులో గుణపాఠం చెబుతామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…