Tejaswini Reddy mother : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్ లో ఏంఎస్ చేయడానికి రెండేళ్ల క్రితం వెళ్ళింది. అయితే తాజాగా ఆమె చదువు అయిపోయి తిరిగి ఇండియా రావాల్సిన ఉండగా ఇంతలోనే ఒక కిరాతకుడు ఆమెను హత్య చేసాడు. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్మెంట్కే చెందిన బ్రెజిల్ కి చెందిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు . లండన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విషయం తెలిసీ తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. త్వరలో తేజస్విని కి పెళ్లి చేయాలని అనుకుంటుండగా ఇలా జరిగిందని బాధపడ్డారు.
చదువు కోసం వెళితే ఇలా చంపేస్తారా….
తేజస్విని రెడ్డి మరణ వార్త విని ఆమె తల్లి కుప్పకూలి పోయారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నా కూతురు చదువుకోడానికి లండన్ వెళ్ళింది. ఇంకొద్ది రోజుల్లో ఇండియా తిరిగి వస్తుందని అనుకుంటే ఇంతలో ఇలాంటిది వినాల్సివచ్చిందని కన్నీరు పెట్టుకున్నారు. తేజస్విని తో పాటు తేజస్విని కజిన్స్ కూడా లండన్ లో ఉన్నారని అయితే అబ్బాయిలందరు స్నేహితుల వద్ద ఉండగా తేజ వేరే అపార్ట్మెంట్ లో ఉండాల్సి వచ్చిందని రెండు నెలల క్రితమే తాను పనిచేసే చోటుకు దగ్గరగా ఉంటుందని వెళ్లిందని అక్కడ మన తెలుగమ్మాయి అఖిల పరిచయమైందని ఇద్దరు బాగా ఉండేవారు ఆ అమ్మాయి అఖిల అక్కడ రెండేళ్లుగా ఉండేదనీ చెప్పారు తేజ తల్లి.
అయితే హత్య జరిగిన రోజు అంతకుముందే కూతురితో మాట్లాడినట్లు నాన్నతో మాట్లాడాలి అంటూ చాలా అడిగింది మళ్ళీ చేస్తానని చెప్పాను ఇంతలో ఇలా జరిగింది. ఫుడ్డు కూడా బయట నుండి తెచ్చుకుని తిన్నారు స్నేహితులు ఇద్దరు. కిచెన్ లోకి ప్లేట్ పెట్టడానికి వెళ్లిన సమయంలో అప్పటికే అక్కడ తిరుగుతున్న ఆ బ్రెజిల్ దేశస్తుడు కెవిన్ కత్తితో విచక్షణారాహితంగా పొడిచాడు. అరిచేసరికి అఖిల వచ్చి అడ్డుకోవడంతో ఆ అమ్మాయిని పొడిచాడట. ఆ అమ్మయి ఆసుపత్రి లో చికిత్స పొంది నిన్న మళ్ళీ రూమ్ కి వచ్చింది. కానీ నా కూతురు అక్కడికక్కడే చనిపోయింది. నా కూతురు శవం అయినా తొందరగా ఇండియా వచ్చేలా చేయండి అంటూ కెసిఆర్ ప్రభత్వాన్ని ఏడుస్తూనే వేడుకొన్నారు తేజస్విని రెడ్డి తల్లి.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…