తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ మరోసారి పోడిగించావద్దని భావిస్తుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కరోనా కేసుల పెరుగుతున్న సమయంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో ఇకపై పగటిపూట పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేసి రాత్రి పూట కర్ఫ్యూ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మే 12 నుంచి 30 వరకు లాక్డౌన్ విధించిన ప్రభుత్వం కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది. గత నెల మే 31 నుంచి సడలింపులో మార్పులు చేసి మధ్యాహ్నం 2 వరకు పొడిగించింది. అయితే ప్రస్తుత లాక్ డౌన్ గడువు గడువు బుధవారంతో ముగుస్తుండటంతో తాజగా పగటిపూట లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇకపై లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. వ్యాపారాలతో పాటూ మెట్రో, బస్సులకు సాయంత్రం 7 వరకు అనుమతీ ఇవ్వనున్నట్టు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…