Telugu Anchor: తెలుగు బుల్లితెరపై ఎంతో మంది గ్లామరస్ యాంకర్లు ఉన్నారు. సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి ఎంతోమంది ఫోటా పోటీగా బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు. అయితే వీరందరిలో కల్లా శ్రీముఖి మాత్రం కాస్త భిన్నం అని చెప్పాలి.ఇలా ఈమె ఒకవైపు వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే బుల్లితెరపై మాత్రం అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు.
ఇలా బుల్లితెర యాంకర్ గా ప్రతి ఒక్క ఛానల్ లోను ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈమె ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇదివరకే ప్రసారమైన షోలో ఈమె సింగర్ శ్రీ చరణ్ తో లవ్ ట్రాక్ ఉన్నట్లు ఫ్రాంక్ చేశారు. అయితే అదంతా కూడా కేవలం టిఆర్పి కోసమేనని తేలిపోయింది. అయితే ప్రస్తుతం సరిగమప చాంపియన్ షిప్ నడుస్తోంది.
ఈ కార్యక్రమంలో పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీ చరణ్ సైతం ఈ కార్యక్రమంలో భాగంగా తాళికట్టు శుభవేళ అనే పాట పాడుతాడు పాట అనంతరం యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ… ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ మర్చిపోయిన స్టూడెంట్ లా ఉన్నారని అనగా వెంటనే జడ్జ్ అనంత శ్రీరామ్ ముందు సీజన్లో అయితే తనకు కావాల్సిన వాళ్ళు యాంకరింగ్ చేసే వాళ్ళు అని అంటారు.
అనంత శ్రీరామ్ ఇలా అనగానే ప్రదీప్ వెంటనే శ్రీముఖికి ఫోన్ చేసి ఇవ్వగా చరణ్ జలజల జలపాతం నువ్వు అనే పాట పాడుతారు.అవతల వైపు శ్రీముఖి నాకు పాడాలని ఉంది కానీ జలుబు చేసిందని చెప్పగా ఎలా ఉన్నారండి అని శ్రీముఖిని అడుగుతారు. ఇలా సడన్ గా రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి మామయ్య గారు షూటింగుకు వచ్చారా.. అంటూ శ్రీముఖి మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ నవ్వుతారు. శ్రీముఖి ఫోన్ కాల్ లీక్ అవడంతో నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారా లేకపోతే షోలో భాగంగానే ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…