General News

భారత్‌కు ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. విమానాశ్రయాలపై హై అలెర్ట్

భారత్‌ ప్రస్తుతం అన్ని వైపుల నుంచీ ఉగ్ర ముప్పును ఎదుర్కొంటున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించాయి. ఈ దాడులు సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 2 మధ్యలో జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. దీనితో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో (BCAS) అన్ని విమానాశ్రయాలకు హై అలెర్ట్‌ జారీ చేసింది.

Terror threat warnings for India.. High alert at airports

విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రత

కేంద్ర విమానయాన భద్రతా బ్యూరో ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల భద్రతను గణనీయంగా పెంచారు. రన్‌వేలు, హెలిప్యాడ్స్‌, ఫ్లైయింగ్‌ స్కూల్స్‌, ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించింది. టర్మినల్స్‌, పార్కింగ్‌, పెరిమీటర్‌ జోన్‌ వంటి అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను బలోపేతం చేశారు. ప్రతి మూలను అనుక్షణం తనిఖీ చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

అంతేకాకుండా, స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్గాల ద్వారా వచ్చే మెయిల్‌ పార్సిళ్లను కూడా పూర్తిగా సోదా చేస్తున్నారు. సిబ్బంది, కాంట్రాక్టర్లు, సందర్శకులందరినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వెంటనే చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే మాక్ డ్రిల్స్‌ను కూడా నిర్వహించాలని అధికారులు సూచించారు.

ఢిల్లీలో అక్రమ వలసదారుల అరెస్టు

ఈ నేపథ్యంలో నిన్న దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఒక ఘటన మరింత ఆందోళన కలిగించింది. ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు బంగ్లాదేశ్‌ వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసుల సమాచారం ప్రకారం, అరెస్టయిన వారందరి వయస్సు 20-25 సంవత్సరాల మధ్య ఉంటుంది. వారు ఢిల్లీలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారి వద్ద నుంచి కొన్ని బంగ్లాదేశ్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ఎటువంటి అనుమతి లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన ఈ వ్యక్తులపై ఉగ్రవాద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సరిహద్దుల్లో ఉద్రిక్తత

ఇక సరిహద్దుల్లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఫూంచ్‌ సెక్టార్‌లో దాదాపు 15 నిమిషాలపాటు పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. దీని కారణంగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు హై అలెర్ట్‌ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago