Gunturu kaaram: ప్రస్తుతం కుర్చీ తాత పాషా పేరు ట్రెండ్ అవుతోంది. ఆ మధ్యకాలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తాత కుర్చీ మడతపెట్టి అంటూ చెప్పినటువంటి డైలాగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది అయితే ఇదే పాటను మహేష్ బాబు నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమాలో పెట్టారు. ఇటీవల ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ గా మారడంతో ఈ తాత కాస్త ట్రెండ్ అవుతున్నారు.
సాంగ్ ప్రోమో విడుదల తర్వాత రెండ్రోజులు కనిపించని కుర్చీ తాత పాషా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే రెండు మూడు రోజుల క్రితం తాను తన బంధువులు ఇంటికి వరంగల్ వెళ్లానని ఈయన వెల్లడించారు.
ఇక గుంటూరు కారం సినిమాలో ఆ పాటను పెట్టడం గురించి ఈయన మాట్లాడుతూ నాకు ఆ సినిమాలో పాట పెట్టడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఈ పాటను తానే పాడానని తనతో పాటు మరొక సింగర్ కూడా పాడారు అంటూ కుర్చీ తాత వెల్లడించారు. ఇక ఈ పాట పాడినందుకు నాకు లక్ష రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని ఈయన తెలిపారు.
ఆ అవకాశం నాకు రాలేదు…
ఇక ఈ పాట పాడే సమయంలో తాను ఒకసారి కూడా మహేష్ బాబుని కలవలేదని ఆ అవకాశం నాకు రాలేదని తెలిపారు. ఒకసారి తను స్టూడియోకు వెళ్లే వరకే బాబు కారు వెళ్లిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ రాబోతోంది. మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఈ పాట ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…