Gunturu kaaram: ప్రస్తుతం కుర్చీ తాత పాషా పేరు ట్రెండ్ అవుతోంది. ఆ మధ్యకాలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తాత కుర్చీ మడతపెట్టి అంటూ చెప్పినటువంటి డైలాగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది అయితే ఇదే పాటను మహేష్ బాబు నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమాలో పెట్టారు. ఇటీవల ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ గా మారడంతో ఈ తాత కాస్త ట్రెండ్ అవుతున్నారు.
సాంగ్ ప్రోమో విడుదల తర్వాత రెండ్రోజులు కనిపించని కుర్చీ తాత పాషా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే రెండు మూడు రోజుల క్రితం తాను తన బంధువులు ఇంటికి వరంగల్ వెళ్లానని ఈయన వెల్లడించారు.
ఇక గుంటూరు కారం సినిమాలో ఆ పాటను పెట్టడం గురించి ఈయన మాట్లాడుతూ నాకు ఆ సినిమాలో పాట పెట్టడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఈ పాటను తానే పాడానని తనతో పాటు మరొక సింగర్ కూడా పాడారు అంటూ కుర్చీ తాత వెల్లడించారు. ఇక ఈ పాట పాడినందుకు నాకు లక్ష రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని ఈయన తెలిపారు.
ఆ అవకాశం నాకు రాలేదు…
ఇక ఈ పాట పాడే సమయంలో తాను ఒకసారి కూడా మహేష్ బాబుని కలవలేదని ఆ అవకాశం నాకు రాలేదని తెలిపారు. ఒకసారి తను స్టూడియోకు వెళ్లే వరకే బాబు కారు వెళ్లిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ రాబోతోంది. మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఈ పాట ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…