హైదరాబాద్: టాలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సీనియర్ యాంకర్ ఉదయభాను, తన స్టైల్, ఎనర్జీ, పర్ఫార్మెన్స్తో మంచి గుర్తింపు సంపాదించారు. సుమ, ఝాన్సీ తదితరుల కంటే ముందుగానే యాంకరింగ్లో అడుగుపెట్టి, టాప్ యాంకర్గా వెలుగొందిన ఉదయభాను, తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో యూట్యూబ్ వేదికగా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.
ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఉదయభాను మాట్లాడుతూ… ‘‘ఇండస్ట్రీలో ఇప్పుడు యాంకరింగ్లో సిండికేట్లు పెరిగిపోయాయి. నా షెడ్యూల్లో ఉన్న ఈవెంట్ చివరివేళ క్యాన్సిల్ అయింది. నా బదులు వేరే యాంకర్ను తీసుకున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఆమెను కావాలనే అవకాశాల నుండి దూరం పెడుతున్నారా? అనేది సందేహంగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉదయభాను గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సుమ కనకాల. ఆమె ఉన్న స్థానం హైపోజిషన్. కానీ ఆమె ఒక్కరిని తొక్కేసి అక్కడకు చేరలేదు. ఒకప్పుడు ఉదయభాను కూడా టాప్ యాంకర్గానే ఉన్నారు. అప్పుడు మరి ఆమె కూడా ఇతరులను తొక్కేసిందా?’’ అని ప్రశ్నించారు.
ఇకపోతే… ‘‘ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతంగా ఉండరు. ఒక్కో సమయంలో ఒక్కోరు వెలుగుతారు. ఉదయభాను గారు వ్యక్తిగత కారణాల వల్ల గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ను సుమ గారు భర్తీ చేశారు. రేపు సుమకి కూడా గ్యాప్ వస్తే మరొకరు ఆమె స్థానాన్ని ఆక్రమించేవారే. ఇది సహజమైన పరిణామం. అందుకే ఇలా అవకాశాలు తగ్గిపోతే ఇతరులపై విమర్శలు చేయడం సరైంది కాదు’’ అంటూ స్పష్టం చేశారు.
నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు కూడా ‘‘ఈయన చెప్పింది నిజమే కదా’’ అంటూ ఆయన అభిప్రాయాలకు మద్దతు ఇస్తున్నారు. మొత్తానికి… ఉదయభాను వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి ఇండస్ట్రీలోని పోటీ, అవకాశాల రాజకీయాలపై చర్చ ఊపందుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…