Murali Mohan:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు.
ఈ విధంగా వ్యాపార రంగంలో ఎంతో మంచి గుర్తింపు పొందిన మురళీమోహన్ నిర్మాతగా సొంత బ్యానర్ ఏర్పాటు చేసి తన బ్యానర్ లో సుమారు 25 చిత్రాలను తెరకెక్కించారు.ఈ విధంగా తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75శాతం మంచి విజయాలను అందుకున్నాయని మురళీమోహన్ వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ క్రమంలోని సినిమాలలో కొనసాగుతూనే నిర్మాతగా అడుగు వేయడం ఎంతవరకు సబబు అని ఆలోచించి నిర్మాణ రంగం వైపు వచ్చామని వెల్లడించారు. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75% మంచి విషయాలను అందుకున్నాయని మురళీమోహన్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
ఇకపోతే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాని కూడా మురళీమోహన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే ఈ సినిమా అతనికి నష్టాలను తేవటం వల్లే అనంతరం తన బ్యానర్లో సినిమాలు చేయలేదని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. అతడు సినిమా తనకు ఎలాంటి నష్టాలను తేలేదని అయితే ఈ కథ విన్న తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని ముందుగానే భావించాము. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా ఫలానా టైంకు షూటింగ్ పూర్తి కావాలి అనుకున్న తేదీకే విడుదల కావాలని ఉంటుంది. ఈ సినిమా ఆరు నెలలలో పూర్తి అవుతుంది అనుకుంటే సంవత్సరం సమయం పట్టిందని, బడ్జెట్ కూడా మా కంట్రోల్ తప్పిందని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలలో నష్టాలు రావడం వల్ల సినిమాలు చేయడం మానేయలేదు కానీ వ్యాపార రంగంలో బిజీ కావడం వల్లే సినిమాలకి కొన్ని రోజులు విరామం ఇచ్చామని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…