Murali Mohan:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు.
ఈ విధంగా వ్యాపార రంగంలో ఎంతో మంచి గుర్తింపు పొందిన మురళీమోహన్ నిర్మాతగా సొంత బ్యానర్ ఏర్పాటు చేసి తన బ్యానర్ లో సుమారు 25 చిత్రాలను తెరకెక్కించారు.ఈ విధంగా తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75శాతం మంచి విజయాలను అందుకున్నాయని మురళీమోహన్ వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ క్రమంలోని సినిమాలలో కొనసాగుతూనే నిర్మాతగా అడుగు వేయడం ఎంతవరకు సబబు అని ఆలోచించి నిర్మాణ రంగం వైపు వచ్చామని వెల్లడించారు. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75% మంచి విషయాలను అందుకున్నాయని మురళీమోహన్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.
ఇకపోతే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాని కూడా మురళీమోహన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే ఈ సినిమా అతనికి నష్టాలను తేవటం వల్లే అనంతరం తన బ్యానర్లో సినిమాలు చేయలేదని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. అతడు సినిమా తనకు ఎలాంటి నష్టాలను తేలేదని అయితే ఈ కథ విన్న తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని ముందుగానే భావించాము. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా ఫలానా టైంకు షూటింగ్ పూర్తి కావాలి అనుకున్న తేదీకే విడుదల కావాలని ఉంటుంది. ఈ సినిమా ఆరు నెలలలో పూర్తి అవుతుంది అనుకుంటే సంవత్సరం సమయం పట్టిందని, బడ్జెట్ కూడా మా కంట్రోల్ తప్పిందని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలలో నష్టాలు రావడం వల్ల సినిమాలు చేయడం మానేయలేదు కానీ వ్యాపార రంగంలో బిజీ కావడం వల్లే సినిమాలకి కొన్ని రోజులు విరామం ఇచ్చామని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…