This is the reason why Krish quit! Director Jyothi Krishna made sensational comments
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “హరిహర వీరమల్లు” ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక, మొదట ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి గల కారణాన్ని కూడా వివరించారు. మొదట్లో “హరిహర వీరమల్లు” చిత్రాన్ని ఒక కామెడీ సినిమా చేయాలన్న ఆలోచనతో మొదలుపెట్టామని ఆయన తెలిపారు.
జ్యోతికృష్ణ మాట్లాడుతూ – “నేను ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఉన్నాను. ఈ కథలో ముఖ్యాంశంగా ఉండే కోహినూర్ డైమండ్ నేపథ్యంలో సినిమా తయారు చేయాలని అనుకున్నాం. దర్శకుడు క్రిష్ దీన్ని మాయాబజార్ స్టైల్ కామెడీగా తీయాలనుకున్నారు. సినిమా పనులను కూడా అదే ఉద్దేశ్యంతో మొదలుపెట్టాం. మొదట ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. కానీ తీరా కరోనా వచ్చింది. మళ్లీ మేము మరో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తే.. అప్పటికే రెండో వేవ్ వచ్చేసింది. దానికి తోడు ఎన్నికలు జరిగిపోయాయి. దీంతో సినిమాకు పెద్ద విరామం వచ్చింది” అని వివరించారు.
ఇక ఈ విరామం సమయంలో క్రిష్ తనకు ముందే ఒప్పుకున్న ఇతర ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సి రావడంతో “హరిహర వీరమల్లు” నుంచి వైదొలిగినట్లు జ్యోతికృష్ణ తెలిపారు. ఆ తరువాత జ్యోతికృష్ణే ఈ ప్రాజెక్ట్కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. “నేను ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్గా ప్లాన్ చేశాను. పవన్ గారికి ఈ విషయం వివరించగానే – ‘బాగుంది.. నువ్వే దర్శకత్వం తీసుకో’ అన్నారు. అప్పటి నుంచి నా జర్నీ మొదలైంది. మొదటి భాగం కథలో కొన్ని మార్పులు చేశాను. కోహినూర్ ప్రధానాంశం మాత్రం పార్ట్-2లో చూపించబోతున్నాం. కోహినూర్ కోసం ఏం జరిగిందనేది అక్కడ రివీల్ చేస్తాం” అని అన్నారు.
వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే – “ఈ సినిమాలో మొత్తం 4,399 సీజీ షాట్లు వాడాం. వాటిలో 4-5 షాట్లు కొంచెం నాసిరకంగా వచ్చాయి. వాటిని కూడా మళ్లీ మార్చాం. సినిమాకు టెక్నికల్గా ఎంతో మేం కష్టపడాం” అని జ్యోతికృష్ణ స్పష్టం చేశారు.
మొత్తంగా, ఈ చిత్రం ఒక యాక్షన్ పీరియాడికల్ డ్రామాగా మారిపోవడం, దాని వెనుక ఉన్న ప్రయాణం, వాస్తవాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. Part 2లో కోహినూర్ కథలో ఇంకా ఏం ఉంటుందో చూడాల్సిందే.
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…