Movie News

HHVM : క్రిష్ వైదొలగడానికి కారణం ఇదే! సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “హరిహర వీరమల్లు” ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ పరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక, మొదట ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి గల కారణాన్ని కూడా వివరించారు. మొదట్లో “హరిహర వీరమల్లు” చిత్రాన్ని ఒక కామెడీ సినిమా చేయాలన్న ఆలోచనతో మొదలుపెట్టామని ఆయన తెలిపారు.

This is the reason why Krish quit! Director Jyothi Krishna made sensational comments

‘మాయాబజార్’ స్టైల్ కామెడీ నుంచి యాక్షన్ డ్రామాగా మారిన ప్రస్థానం

జ్యోతికృష్ణ మాట్లాడుతూ – “నేను ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఉన్నాను. ఈ కథలో ముఖ్యాంశంగా ఉండే కోహినూర్ డైమండ్ నేపథ్యంలో సినిమా తయారు చేయాలని అనుకున్నాం. దర్శకుడు క్రిష్ దీన్ని మాయాబజార్ స్టైల్ కామెడీగా తీయాలనుకున్నారు. సినిమా పనులను కూడా అదే ఉద్దేశ్యంతో మొదలుపెట్టాం. మొదట ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాం. కానీ తీరా కరోనా వచ్చింది. మళ్లీ మేము మరో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తే.. అప్పటికే రెండో వేవ్ వచ్చేసింది. దానికి తోడు ఎన్నికలు జరిగిపోయాయి. దీంతో సినిమాకు పెద్ద విరామం వచ్చింది” అని వివరించారు.

క్రిష్ వైదొలగడానికి అసలు కారణం, జ్యోతికృష్ణ దర్శకత్వం

ఇక ఈ విరామం సమయంలో క్రిష్ తనకు ముందే ఒప్పుకున్న ఇతర ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సి రావడంతో “హరిహర వీరమల్లు” నుంచి వైదొలిగినట్లు జ్యోతికృష్ణ తెలిపారు. ఆ తరువాత జ్యోతికృష్ణే ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. “నేను ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్‌గా ప్లాన్ చేశాను. పవన్ గారికి ఈ విషయం వివరించగానే – ‘బాగుంది.. నువ్వే దర్శకత్వం తీసుకో’ అన్నారు. అప్పటి నుంచి నా జర్నీ మొదలైంది. మొదటి భాగం కథలో కొన్ని మార్పులు చేశాను. కోహినూర్ ప్రధానాంశం మాత్రం పార్ట్-2లో చూపించబోతున్నాం. కోహినూర్ కోసం ఏం జరిగిందనేది అక్కడ రివీల్ చేస్తాం” అని అన్నారు.

VFX పై వివరణ: “4-5 షాట్లు మాత్రమే నాసిరకం”

వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే – “ఈ సినిమాలో మొత్తం 4,399 సీజీ షాట్లు వాడాం. వాటిలో 4-5 షాట్లు కొంచెం నాసిరకంగా వచ్చాయి. వాటిని కూడా మళ్లీ మార్చాం. సినిమాకు టెక్నికల్‌గా ఎంతో మేం కష్టపడాం” అని జ్యోతికృష్ణ స్పష్టం చేశారు.

పార్ట్ 2 పై ఆసక్తి

మొత్తంగా, ఈ చిత్రం ఒక యాక్షన్ పీరియాడికల్ డ్రామాగా మారిపోవడం, దాని వెనుక ఉన్న ప్రయాణం, వాస్తవాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. Part 2లో కోహినూర్ కథలో ఇంకా ఏం ఉంటుందో చూడాల్సిందే.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago