Mohan Babu: కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ట్రోల్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తనపై ఇద్దరు హీరోలు దగ్గరుండి మరి సోషల్ మీడియా వేదికగా తనని ట్రోల్స్ చేయిస్తున్నారని మోహన్ బాబు వెల్లడించారు.
ఈ విధంగా తన గురించి ట్రోల్స్ చేయడానికి ఏకంగా 100 మంది పని చేస్తున్నారని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ విషయాన్ని మోహన్ బాబు బయటపెట్టారు. ఇక తన గురించి ఈ విధంగా వచ్చిన ట్రోల్స్ తెలిసినవారు తనకి పంపిస్తుంటారని అయితే అలాంటి వాటిని చూసినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని ఆయన తెలియజేశారు.
ఒక వ్యక్తి గురించి ట్రోల్స్ అంటే నవ్వేలా ఉండాలి కానీ ఈ విధంగా ఒకరిని కించపరచకూడదని ఆయన వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం తనకు తెలుసునని ఇప్పుడు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం వల్ల వారికి తాత్కాలిక ఆనందం మాత్రమే ఉంటుంది కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారని నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం గురించి మాత్రం మోహన్ బాబు బయటపెట్టలేదు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…