Mohan Babu: కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేశారు. ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న ట్రోల్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా తనపై ఇద్దరు హీరోలు దగ్గరుండి మరి సోషల్ మీడియా వేదికగా తనని ట్రోల్స్ చేయిస్తున్నారని మోహన్ బాబు వెల్లడించారు.

ఈ విధంగా తన గురించి ట్రోల్స్ చేయడానికి ఏకంగా 100 మంది పని చేస్తున్నారని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ విషయాన్ని మోహన్ బాబు బయటపెట్టారు. ఇక తన గురించి ఈ విధంగా వచ్చిన ట్రోల్స్ తెలిసినవారు తనకి పంపిస్తుంటారని అయితే అలాంటి వాటిని చూసినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని ఆయన తెలియజేశారు.
తాత్కాలిక ఆనందం పొందుతున్నారు…
ఒక వ్యక్తి గురించి ట్రోల్స్ అంటే నవ్వేలా ఉండాలి కానీ ఈ విధంగా ఒకరిని కించపరచకూడదని ఆయన వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం తనకు తెలుసునని ఇప్పుడు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం వల్ల వారికి తాత్కాలిక ఆనందం మాత్రమే ఉంటుంది కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారని నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే విషయం గురించి మాత్రం మోహన్ బాబు బయటపెట్టలేదు.


































