Dog: కుక్క పిల్లపై మోజుతో గొడవ పడిన ముగ్గురు యువకులు… చివరికిలా ఆస్పత్రి పాలు!
Dog: కొంతమందికి ఇంట్లో కుక్క పిల్లలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టం. వాటిని ఇంట్లో మనిషిని ఎలా అయితే ట్రీట్ చేస్తారో అంత కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. వాటికి ఏమైనా బాధ కలిగితే చెప్పడానికి నోరు ఉండదు.. కానీ వాటి హావభావాల ద్వారా కొంతమంది అర్థం చేసుంటారు.
ఇక కుక్కకి మనిషికి కూడా లేనంత విశ్వాసం ఉంటుంది అని అంటుంటాం. ఒక్కసారి ఏ కుక్కకైనా అన్నం పెడితే అది చాలా రోజుల వరకు గుర్తు పెట్టుకుంటుందట. ఇక ఇక్కడ జరిగిన ఘటన కుక్క పిల్ల కోసం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మంగాపురంలో రైతు అమరనాథరెడ్డి తన పొలంలోని షెడ్ వద్ద ఆదివారం ఉదయం ఓ కుక్క పిల్లను కట్టి ఉంచాడు. దానిని ప్రతీ రోజు ఇంటి నుంచి పొలానికి తీసుకెళ్తుండేవాడు. దానిని పొలంలోకి కోతులు మరియు మరేదైనా జంతువులు రాకుండా కాపలాగా ఉపయోగించుకునే వాడు.
అయితే ఆ కుక్కపిల్లపై అదే గ్రామానికి చెందిన శబరీష్ అనే యువకుడు మోజు పడ్డాడు. ఆ కుక్కపిల్లను కట్టేసింది చూసి.. అక్కడ నుంచి దానిని ఎత్తుకెళ్లాడు. కాసేపటి తర్వాత ఈ విషయం తెలుసుకున్న అమరనాథరెడ్డి.. వెంటనే శబరీష్ను మందలించాడు. ఇలా అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తావ్ అంటూ ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది.మాట మాట పెరిగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ.. కొట్టుకున్నారు కూడా. అంతే కాకుండా ఈ గొడవ అక్కడితో ఆగలేదు. శబరీష్ ఇంటికి వెళ్లి తన సోదరుడు మంజునాథరెడ్డికి విషయం తెలిపి.. అమరనాథరెడ్డి వద్దకు పిలుచుకొని వెళ్లాడు. మళ్లీ పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇలా అక్కడ ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులకు విషయం తెలియడంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇలా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం ప్రారంభించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…