General News

వర్షపు నీటిని ఒడిసి పట్టి.. ఇలా చేయండి.. మీ ఆయుష్షు పెరిగినట్టే..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కలుషితం. అటువంటి ఆహారాన్ని తినడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. దాహం వస్తే ఒకప్పుడు కుళ్లాయి దగ్గరకు వెళ్లి మంచి నీళ్లు తాగేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. మినరల్ వాటర్ లేనిదే చాలామంది నీటిని తాగడం లేదు. ప్రతీ గ్రామంలో దాదాపు మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. దీనిని బట్టే అర్థం అవుతోంది.. పల్లెల్లో కూడా స్వచ్చమైన తాగునీటికి కరువు ఏర్పడిందని.

ఇటువంటి సమయంలో .. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం పివిపురం బలిజపల్లిలో గుణశేఖర్ రెడ్డి కుటుంబం తాగునీటి విషయంలో వినూత్నంగా ఆలోచించింది. వర్షపు నీటిని ఒడిసి పట్టి వాటిని.. పైపుల్లోకి అమర్చిరైన్ టాప్ రూఫ్ వాటర్ ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసేలా ఏర్పాటు చేశారు. అలా శుభ్రం అయిన నీటిని వాటర్ క్యాన్లలో పట్టి.. వాటిని భూమిలో ఏర్పాటు చేసిన సంపులోకి వదిలిపెట్టారు.

అందులో బొగ్గు, పచ్చి గడ్డి, ఇసుక, గులకరాళ్లుతో వలతో వివిధ లేయర్లుగా ఏర్పాటు చేశారు. ఇలా వాటి నుంచి ఫిల్టర్ అయిన వర్షపు నీటిని తాగడానికి ఉపయోగిస్తామని వాళ్లు తెలిపారు. వీటికి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అయిందని చెప్పుకొచ్చారు. నిజానికి వర్షపు నీరు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైందట. సైంటిస్టులు చేసిన అధ్యయనాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

అయితే వర్షపు నీటిని నేరుగా పట్టుకోవాలి. అది కూడా శుభ్రమైన పాత్రల్లో పట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా పైన చెప్పిన విధంగా నిల్వ చేసుకున్న నీటిని తాగవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. అలా తయారు చేసుకున్న నీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని గుణశేఖర్ అంటున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టికెట్ పెంపుపై దుమారం… చివరకు తగ్గిన దేవస్థానం!

శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…

59 minutes ago

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…

2 hours ago

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

12 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

12 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

12 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

12 hours ago