Movie News

Tanikella Bharani: త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి రచయితలు అందరికీ రెమ్యూనరేషన్ పెంచాడు.. అప్పట్లో ఐదు వేలు మాత్రమే కానీ ఇప్పుడు.. : తనికెళ్ల భరణి

Tanikella Bharani: తనికెళ్ల భరణి ఎన్నో సినిమాలకు రచయితగా, ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో తాను రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఎంతోమంది నేను సెట్ లోకి వెళ్ళగానే ఒక కాలి పేపర్ ఇచ్చి నా డైలాగ్స్ నన్ను రాసుకోమని చెప్పేవారు.

రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఇది నాకు చాలా డిసడ్వాంటేజెస్ గా ఉండేదని,మరికొందరైతే దారుణంగా మిమ్మల్ని పెట్టుకున్నది ఎందుకు సార్ అంటూ నా చేత డైలాగులు రాయించుకునే వారంటూ తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే అప్పట్లో రచయితలకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఈ సందర్భంగా ఈయన ప్రస్తావించారు.

అప్పట్లో రచయితలకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను రచయిత గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నాకు కేవలం ఐదు వేలు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయితలు ఇండస్ట్రీలోకి వచ్చారో అప్పుడే రచయితలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తనికెళ్ల భరణి వెల్లడించారు.

డైరెక్టర్లకు సమానంగా…

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం రచయితగా పని చేస్తే ఆయన డైరెక్టర్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రచయితలకు డైరెక్టర్లకు ఒకే ఈ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారని, రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తనికెళ్ళ భరణి వెల్లడించారు. అప్పట్లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం రచయితలకు మంచి సంపాదన ఉంటుందని తనికెళ్ల భరణి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

12 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

12 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

14 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

14 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

15 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

15 hours ago