టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ మధ్య ఈ హీరో తాను గతంలో పనిచేసిన దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు.. గతంలో కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ చేశాక తక్కువ విరామంలో మళ్లీ అదే దర్శకుడితో ‘భరత్ అనే నేను’ చేశాడు. ‘మహర్షి’ తీసిన వంశీ పైడిపల్లితో కూడా వెంటనే ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు కానీ.. మహేష్ మెచ్చే కథను వంశీ సిద్ధం చేయలేకపోవడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది.
ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్తోనూ మరో సినిమాకు మహేష్ కమిట్మెంట్ ఇచ్చాడు. నిజానికి ‘సర్కారు వారి పాట’ తర్వాత అనిల్తోనే మహేష్ సినిమా చేయాల్సింది. దీనికి అనిల్ కథ కూడా రెడీ చేసేశాడట. ఐతే ఈలోపు అనుకోకుండా త్రివిక్రమ్తో సినిమాను ముందుకు తెచ్చాడు మహేష్.’ఎఫ్-3′ తర్వాత తాను మహేష్ సినిమాను మొదలుపెట్టాల్సి ఉండగా.. అనుకోకుండా త్రివిక్రమ్ సినిమా రావడంతో అది ఆలస్యం అవుతోందని ఓపెన్గానే చెప్పేశాడు అనిల్.
త్రివిక్రమ్తో మహేష్ సినిమా అవ్వగానే ఆయనతో తన సినిమా మొదలవుతుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. బహుశా అనిల్ కెరీర్ ఆరంభం నుంచి అతడితో జర్నీ చేస్తున్న దిల్ రాజే ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుతం చేస్తున్న ‘ఎఫ్-3’ గురించి అనిల్ చెబుతూ.. ఏప్రిల్ 15న మైసూర్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాల్సిందని.. కానీ 14న తనకు కరోనా రావడంతో ఆ ప్లాన్ మొత్తం మారిపోయిందని చెప్పాడు.
ఇప్పటికి 50 శాతానికి పైగానే సినిమా పూర్తయిందని.. మైసూర్ షెడ్యూల్ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే 80 శాతం షూటింగ్ అయిపోయేదని అన్నాడు. తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పుడు కొత్తగా షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నట్లు అనిల్ వెల్లడించాడు.తన భార్య, పిల్లలకు కూడా కరోనా సోకిందని.. దేవుడి దయ వల్ల అందరూ కోలుకున్నారని అనిల్ వెల్లడించాడు. ‘ఎఫ్-3’ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చెన్నైలోని ఒక హోటల్కు వెళ్లానని.. బహుశా అక్కడే తనకు కరోనా సోకి ఉండొచ్చని భావిస్తున్నట్లు అనిల్ తెలిపాడు..!!
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…