టాలీవుడ్లో ‘పెళ్లి చూపులు’ అనే సినిమా ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి..విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు.. ఇక సినిమాలో హీరో ఫ్రెండుగా అతను చేసిన కామెడీకి ప్రేక్షకులు భలేగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సినిమా చివర్లో అనీష్ కురువిల్లా వచ్చి నువ్వేం చేస్తుంటావని అడిగితే.. బుక్కు రాస్తున్నా అనడం.. ఏం బుక్ అని అడిగితే..
‘నా సావు నేను చస్తా. నీకెందుకు’ అని బదులిచ్చే డైలాగ్ ఎంతగా పేలిందో తెలిసిందే. ఆ ఒక్క డైలాగ్తో అతను ఎనలేని పేరు సంపాదించి బిజీ కమెడియన్ అయిపోయాడు.ఈ డైలాగ్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా వాడుకున్నారు. మీమ్స్కైతే లెక్కే లేదు. ఇప్పుడు కరోనా మీద అవగాహన కల్పించడానికి ప్రియదర్శి తన ఫేమస్ డైలాగ్నే ఉపయోగించుకున్నాడు.ప్రస్తుతం కరోనా ఏ స్థాయిలో కల్లోలం రేపుతోందో తెలిసిందే.
ఇప్పటికీ మాస్కు ఆవశ్యకతను గుర్తించని జనాలు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిలో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు ప్రియదర్శి. మాస్కు లేని ఫొటో ఒకటి పెట్టి.. దానికి ‘నా సావు నేను చస్తా. నీకెందుకు’ అని క్యాప్షన్ పెట్టాడు.మాస్కు పెట్టుకున్న మరో ఫొటోను షేర్ చేసి.. దానికి ‘నా బతుకు నేను బతుకుతా. నా అవసరం’ అని క్యాప్షన్ జోడించాడు. మాస్కు పెట్టుకుంటేనే బతుకుతారని.. అది తీసేస్తే ప్రమాదం తప్పదని చాలా చక్కగా, సింపుల్గా చెప్పేశాడు ప్రియదర్శి.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రియదర్శి కెరీర్ విషయానికి వస్తే.. అది మంచి ఊపులోనే ఉంది. అతను ప్రధాన పాత్రలో నటించిన ‘మెయిల్’ ఓటీటీలో, ముగ్గురు హీరోల్లో ఒకడిగా నటించిన ‘జాతిరత్నాలు’ థియేటర్లలో అద్భుత స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే..ఇక ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతోందట..!!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…