టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ద్విపాత్రాభినయం పోషించిన హీరోలు చాలామందే ఉన్నారు..నేటి సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఒకటికి మించే ఉన్నాయి. ఐతే తర్వాతి తరం హీరోలు మాత్రం ద్విపాత్రాభినయాలు చేయడంలో కొంచెం వెనుకబడే ఉన్నారు.ఐతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ‘బాహుబలి’లో రెండు పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.
కాకపోతే ఆ ఆ రెండు పాత్రలు ఒకే సమయంలో కనిపించవు. వేర్వేరు కాలాల్లో ఉంటాయి. ఐతే త్వరలో ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ప్రభాస్లను చూడబోతున్నట్లుగా ఇప్పుడో ఆసక్తికర రూమర్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో అతను డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట.ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా.. మరొకటి కొడుకు పాత్ర అంటున్నారు.సినిమాలో లీడ్ రోల్ కొడుకు పాత్రదే.
సినిమా అంతా ఆ పాత్ర కనిపిస్తుందట. ఐతే తండ్రి పాత్ర కాసేపు ఉంటుందని.. దాని కోసం ప్రభాస్ భిన్నమైన మేకప్లో కనిపించనున్నాడని అంటున్నాడు. కెరీర్లో తొలిసారిగా ఇందుకోసం వృద్ధుడిగా మేకప్ వేసుకోనున్నాడట యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ వృద్ధుడిగా కనిపించబోతున్నాడంటే ఆ అవతారం ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కలగడం ఖాయం. ఈ సినిమా కోసమే ప్రభాస్ కోర మీసంతో కొత్తగా కనిపిస్తుండటం తెలిసిందే.సలార్గా ప్రభాస్ ఫస్ట్ లుక్ చాలా ఎగ్జైటింగ్గానే అనిపించింది.
ఇక అందులో వయసు మళ్లిన పాత్ర లుక్ ఎలా ఉంటుందో చూడాలి. రెండు షెడ్యూళ్ల షూటింగ్ జరిపాక ఈ సినిమా నుంచి ప్రభాస్ బ్రేక్ తీసుకున్నాడు. దీంతో సమాంతరంగా అతను ‘ఆదిపురుష్’ కూడా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రం షూటింగ్ ఇలా మొదలైందో లేదో అలా ఆగిపోయింది. దీనికి కారణం కరోనానే..ఇక పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ప్రభాస్ ఈ సినిమాల షూటింగ్స్ ని ఫినిష్ చేయనున్నాడు…!!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…