దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు రోజు రోజుకూ దిగజారి పోతున్నాయి.ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశాన వాటికలో స్థలం లేకుండా పోతుందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా నదులలో మృతదేహాలు కొట్టుకు రావడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది.గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకురావడం బిహార్లోని బక్సర్ జిల్లాలో కలకలం రేపింది. మహదేవ్ ఘాట్ వద్ద కిలోమీటర్ల పరిధిలో సుమారు 50కి పైగా మృత దేహాలు కొట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కరోనా బారినపడి మృతి చెందినవారి అంత్యక్రియలను నిర్వహించకుండా ఈ విధంగా నదిలో పడేస్తున్నట్లు పోలీసులు భావించారు. వారం రోజుల నుంచి మహాదేవ్ ఘాట్ వద్ద డజన్ల కొద్ది సేవలు కొట్టుకు రావడంతో ఆ శవాలను రాబందులు, కుక్కలు పీక్కు తింటున్నాయి.
కొందరు మహదేవ్ ఘాట్, చౌసా, మిశ్రావలియాచుట్టుపక్కల గ్రామాల నుంచి అంత్యక్రియలు నిర్వహించడం కోసం ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ ఉన్న దృశ్యాలను చూసి అంతక్రియలు నిర్వహించకుండా వెనక్కి వెళ్తున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కరోన బారినపడి కనీసం అంత్యక్రియలకు కూడా నోచుకోకుండా ఆ శవాలను గంగానదిలో పడటం వల్ల కుక్కలు, రాబందులు పీక్కు తినడం చూస్తుంటే మన దేశంలో కరోనా ఏవిధంగా ప్రళయం సృష్టిస్తుందో అర్థమవుతోంది. కనుక ఈ మహమ్మారి నుంచి బయట పడటానికి మార్గం తగిన జాగ్రత్తలు పాటించడమేనని అధికారులు తెలియజేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…