TSPSC: ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం టీఎస్ పీఎస్సీ ముట్టడి… వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిళ అరెస్ట్..
TSPSC: తెలంగాణలో మరో ఒకటిన్నర రెండేళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు కూడా బలపడాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాల్ విసురుతున్నాయి. బీజేపీ పార్టీ బలపడేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాడుతోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు వైఎస్సార్టీపీ పార్టీ కూడా సిద్ధం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా.. టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీపై ఘాటు విమర్శలు చేస్తోంది. సీఎం కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తోంది.
గతంలో ఉద్యోగా నోటిఫికేషన్లు, రైతుల సమస్యలు, పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లపై స్పందించింది. ప్రభుత్వ తీరును విమర్శించింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది.
తాజాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆందోళనకు పిలుపునిచ్చింది. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు భైటాయించి ఆందోళన చేపట్టారు షర్మిల. నిరుద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈక్రమంలో పోలీసులు ఆందోళన చేస్తున్న వైఎస్ షర్మిళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గతం నుంచి కూడా ముఖ్యంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసుకుంటూ… పలు వ్యాఖ్యలు, విమర్శలు చేశారు వైఎస్ షర్మిళ
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…