TSPSC: ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం టీఎస్ పీఎస్సీ ముట్టడి… వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిళ అరెస్ట్..
TSPSC: తెలంగాణలో మరో ఒకటిన్నర రెండేళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు కూడా బలపడాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాల్ విసురుతున్నాయి. బీజేపీ పార్టీ బలపడేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాడుతోంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు వైఎస్సార్టీపీ పార్టీ కూడా సిద్ధం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా.. టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీపై ఘాటు విమర్శలు చేస్తోంది. సీఎం కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తోంది.
గతంలో ఉద్యోగా నోటిఫికేషన్లు, రైతుల సమస్యలు, పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లపై స్పందించింది. ప్రభుత్వ తీరును విమర్శించింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది.
తాజాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆందోళనకు పిలుపునిచ్చింది. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు భైటాయించి ఆందోళన చేపట్టారు షర్మిల. నిరుద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈక్రమంలో పోలీసులు ఆందోళన చేస్తున్న వైఎస్ షర్మిళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గతం నుంచి కూడా ముఖ్యంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసుకుంటూ… పలు వ్యాఖ్యలు, విమర్శలు చేశారు వైఎస్ షర్మిళ
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…