Un Stoppable season 2 : అన్ స్టాపబుల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ ఒక్క షోతో ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేటింగ్స్ లోనూ రికార్డులు సృష్టించింది అన్ స్టాపబుల్. సీజన్ వన్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక సెకండ్ సీజన్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ రెండు మొదటి ఎపిసోడ్ త్వరలో రాబోతోంది, ఇక దీనికి సంబంధించిన ప్రోమో కుడా విడుదల చేసారు. మొదటి ఎపిసోడ్ ఏకంగా తెలుగు దేశం అధినేత స్వయానా బాలయ్య కు బావ అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లను పిలిచి బాలయ్య సందడి చేసారు.
1995 సంక్షోభం గురించి నోరు విప్పిన చంద్రబాబు…
చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్, తెలుగు రాష్ట రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. కానీ ఆయన రాజకీయ జీవితంలో 1995 లో ఎన్టీఆర్ గారిని తొలగించి చంద్రబాబు నాయుడు సీఎం అవడం ఎన్టీఆర్ కుటుంబమే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడటం, ఆనాటి పరిస్థితులను ప్రత్యర్థులు ఆయనను విమర్శించడానికి వెన్నుపోటు అనే ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఇక ఆయన రాజకీయ జీవితానికి అది ఒక మచ్చలాగా ఆయన ప్రత్యర్థులకు ఆయుధం లాగా నేటికీ ఉంది.
ఇక ఈ విషయం గురించి అన్ స్టాపబుల్ షోలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్య పరిచింది. బాలకృష్ణ అడగటం చంద్రబాబు గారు ఆ రోజు పెద్ధాయన ను కాళ్ళు పట్టుకుని బతిమాలాను అంటూ చెప్పడం ప్రోమోలో చూపిస్తారు. ఇక బాలకృష్ణ కూడా ఆ రోజు జరిగింది ఇంకా నాకు గుర్తుంది అంటూ మాట్లాడటం ఒక్కసారిగా షో మొత్తం సీరియస్ అయిపోయింది. ఇన్నేళ్లుగా చంద్రబాబు మీద ఉన్న ఆ నిందపై క్లారిటీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తారేమో చూడాలి.
ఫుట్బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…
భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…
నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…
హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…