Undavalli Sridevi husband Dr. Sridhar : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నది ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ గురించి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు ఆమె పాల్పడినట్లు వైసీపీ అధినేతకు అనుమానం రావడంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఇక ఆమె గురించి వైసీపీ చోటా మోటా నాయకుల నుండి పార్టీ నేతలు ఉండవళ్ళి శ్రీదేవిని బాగా విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దారుణంగా వైసీపీ సానుభూతి పరుల కామెంట్స్ ఉంటున్నాయి. ఇక ఈ ఇష్యూ పై శ్రీదేవి గారి భర్త డాక్టర్ శ్రీధర్ గారు స్పందించారు. మహిళ అని కూడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.
శ్రీదేవికి అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు…
ఉండవల్లి శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణల మీద వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చెయడంతో ఆమె కుటుంబం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆమె క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని, 15 కోట్లు తీసుకుని క్రాస్ ఓటింగ్ టీడీపీ కి అనుకూలంగా ఓటు వేసిందనేది అవాస్తవం అంటూ ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ గారు మాట్లాడారు. రాజకీయాలే మాకు జీవితం కాదు, మేము బాగా స్థిరపడిన కుటుంబం అందునా డాక్టర్స్ కావడం వల్ల పని కూడా ఉంది కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఇలా బురద జల్లుతారని అనుకోలేదు. ఏమాత్రం రాజకీయ అనుభభం లేని నా భార్యను ఏరికోరి రాజాకీయాల్లోకి ఆహ్వానించి ఇలా ఇప్పుడు నిరాధార ఆరోపణలను నమ్మి సస్పెండ్ చెయడం ఏం బాగోలేదంటూ శ్రీధర్ గారు అభిప్రాయపడ్డారు.
శ్రీధర్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా శ్రీదేవి గారు దళిత సామాజిక వర్గాని చెందినవారు. వైద్య విద్య అప్పుడే ఇద్దరూ ప్రేమించుకున్నారట. తానే క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందనే విషయాలను రుజువు చేయడాని ఎటువంటి మెకానిజం వాళ్ళ దగ్గగర లేకపోయినా తానే చేసిందంటూ ఆరోపిస్తూ సస్పెండ్ చేసారు. మీకు నచ్చక పోతే తల నరికేస్తారా.. విచారణ జరపరా అసలు ఎవరు క్రాస్ ఓటింగ్ కి పాల్పడింది అని, ఇదేనా ఒక దళిత మహిళకు మీ పార్టీలో ఇచ్చే గౌరవమంటూ శ్రీధర్ గారు ఫైర్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…