సాధారణంగా సినిమా షూటింగ్ జరిగే సమయాలలో కొన్నిసార్లు ప్రమాదాలు తలెత్తడం సర్వసాధారణమే. ముఖ్యంగా కొన్ని ప్రమాదకరమైన సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో హీరోహీరోయిన్లకి బదులుగా వారి డూప్ లతో సినిమాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విధంగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగామధుసూదన్ రావు దర్శకత్వం వహించిన “అమాయకురాలు” అనే చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శారద టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో అనుకోని ప్రమాదం జరిగే శారదకు డూప్ గా నటిస్తున్నటువంటి ఆమె నీళ్లలో కొట్టుకుపోవడంతో చిత్రబృందం మొత్తం కంగారు పడ్డారు.
కథ ప్రకారం విలన్ రెండవ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం ఆమెను చంపాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే శారదను పిక్నిక్ తీసుకువెళ్లి నీళ్ళల్లో తోసే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం చిత్ర బృందం కేరళలోని త్రివేండ్రం దగ్గరలో ఉన్న అరువికెరా డ్యామ్కు వెళ్లారు. అయితే శారదకు ఈత రాకపోవడం వల్ల ఆమె స్థానంలో ఒక మళయాళీ అమ్మాయి డూప్ గా నటించారు.
అయితే ఆమె నడుముకి రెండు తాళ్ళు కట్టి అవి కనపడకుండా నీటిలో వదిలేసి ఇద్దరు సెట్ బాయ్ లను ఆ తాళ్లను గట్టిగా పట్టుకొమ్మని చెప్పారు. డైరెక్టర్ స్టార్ట్ కెమెరా అనగానే డ్యామ్ కున్న 6 లాకర్స్ తెరుచుకొని ఎక్కువ మొత్తంలో నీటి ఉధృతి వచ్చింది. అదే సమయంలో కెమెరాలో తాళ్లు పట్టుకున్న సెట్ బాయ్స్ కనిపించడంతో డైరెక్టర్ గట్టిగా అరిచారు. ఈ క్రమంలోనే వారు ఉలిక్కిపడి తాళ్లని వదిలేయడంతో శారద డూప్ లో నటిస్తున్నటువంటి అమ్మాయి సుమారు 200 గజాల దూరం వరకు కొట్టుకుపోయింది.
ఈ విధంగా ఆ నీటి ఉధృతిలో అమ్మాయి కొట్టుకుపోతుంటే యూనిట్ సభ్యులు ఎంతో కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆమెను పట్టుకోవాలని నీళ్లలోకి దూకినప్పటికీ వీలు కాలేదు. ఈ క్రమంలోనే స్థానిక ఇద్దరు యువకులు నీళ్లలో దూకి వారిద్దరిని ఒడ్డుకు చేర్చారు. అయితే శారద డూప్ లో నటిస్తున్నటువంటి మలయాళి అమ్మాయికి కూడా ఈత రాకపోయినప్పటికీ ఈత వచ్చని చెప్పడం, డైరెక్టర్ డ్యామ్ 4 లాకర్లు తెరవమంటే ఆరు తెరవడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని ఆ తర్వాత తెలిసింది.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…