V. V. Vinayak : మాస్ సినిమాకు పెట్టింది పేరు వినాయక్. మొదటి సినిమా ‘ఆది’ తోనే హిట్ అందుకుని మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఇక ఆ సినిమా తరువాత చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్ వంటి సినిమాలతో హిట్ అందుకున్న వినాయక్ హీరోలను మాస్ ఎలివేషన్ తో చూపిస్తాడు. దాదాపు అందరు పెద్ద హీరోలతో సినిమాలలు తీసిన వినాయక్ ‘అఖిల్’ సినిమాతో డిజాస్టర్ చూసాడు. ఇమా ఆ తరువాత వచ్చిన ‘ఇంటెలిజెంట్’ సినిమా కూడా నిరాశపరచడంతో ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్స్ చేయకుండా ఛత్రపతి సినిమా హిందీ రీమేక్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో హిట్ అవుతాయనుకున్న కొన్ని సినిమాల ఫలితాలు నిరాశపరచడానికి కారణాలను చెప్పారు.
బద్రినాథ్ సినిమాలో ఆ సీన్స్ లేకపోయింటే హిట్ అయ్యుండేది…
అల్లు అర్జున్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా బద్రినాథ్ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. ఇక ఈ సినిమా వైఫల్యానికి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉండటమే అన్న టాక్ అప్పట్లో వినిపించినా వినాయక్ దాని వివరణ ఇచ్చారు. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ఉండటమే కాదు అలానే సినిమాలో హిమాలయాలు ఆ ప్రాంతాలు మనవాళ్లకు కొత్తగా అనిపించాయి. బాహుబలి లో లాగా ముందు ఏ ప్రాంతం అక్కడ విశిష్టత ఇలాంటి జియోగ్రఫీకి సంబంధించిన విషయాలను వివరించాల్సింది అలా చేయకుండా కథలోకి వెళ్లిపోవడం వల్ల జనాలకు ఎక్కలేదు. ఇక సినిమాలో బ్రహ్మానందం కామెడీ సీన్స్ ట్రాక్ లేకుండా ఉండుంటే సినిమా హిట్ అయ్యుండేది అని నా అభిప్రాయం అంటూ చెప్పారు.
సెకండ్ హాఫ్ సినిమాలో నిడివి తక్కువ అవడం వల్ల ఆ కామెడీ ట్రాక్ ఉంచాల్సి వచ్చింది అంటూ చెప్పారు. ఇక జీవితంలో బాగా బాధపడిన సంఘటన తల్లిదండ్రులు దూరమైనపుడు. ఇక జీవితంలో చేసిన తప్పు అంటే రాశీ నరసింహారావు గారికి దూరం అవడం. పక్కన వాళ్ళు మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టడం వల్ల ఆయన మా నాన్న వద్ద నా గురించి అనకూడని మాట అనడంతో దూరం పెరిగింది. నేను వెళ్లి నేరుగా ఆయనతో మాట్లాడుంటే ఈ మనస్పర్థలు ఉందేవి కాదు అయితే మళ్ళీ కొన్ని రోజులు గడిచాక మళ్ళీ కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, గతంలో జరిగిన విషయాలు మాత్రం నాకు నచ్చవు అలా జరగకుండా ఉండివుంటే బాగుండు అనిపిస్తుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…