సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బేబీ ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇలా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వైష్ణవి చైతన్య ఈ సినిమా గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. తాను ఇప్పటివరకు యూట్యూబర్ గామంచి గుర్తింపు సంపాదించుకున్నాను అయితే సినిమాలలో నటించాలన్న ఉద్దేశంతోనే తాను ఇక్కడికి వచ్చానని సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇక జీవితాంతం తాను యూట్యూబర్ గానే స్థిరపడిపోతానన్న సందేహం తనలో ఉండేదని తెలిపారు.
ఇక సాయి రాజేష్ నాకు ఈ సినిమా కథ చెప్పి నేను నటించగలనన్న ధైర్యం నాలో నింపారని వైష్ణవి చైతన్య వెల్లడించారు. ఈ సినిమాలో తాను ఒకబస్తీలో ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఒక బస్తీ అమ్మాయినేనని ఈ సినిమా కథ వింటున్నప్పుడు నా కథ నాకు గుర్తొచ్చిందని తెలిపారు. ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాకు బేబీ అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న విషయం కూడా ఓ సన్నివేశంలో క్లారిటీగా అర్థమవుతుందని ఈమె తెలియజేశారు.
ఇకపోతే ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్స్ అందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హీరోయిన్స్ అనే విషయం మనకు తెలిసింది. అయితే తెలుగులో కూడా చాలామంది హీరోయిన్స్ ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వారికి అవకాశాలు రాకపోవడానికి మరే కారణం లేదని వైష్ణవి చైతన్య వెల్లడించారు. కథానాయకులుగా తెలుగు వారికి అవకాశాలు ఇవ్వరు అన్న ప్రచారం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ ప్రచారం కారణంగానే చాలామంది తెలుగువారు సినిమాలకు దూరంగా ఉంటున్నారని,ప్రయత్నిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి అంటూ ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…
అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…
మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…
ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…
హైదరాబాద్లో ప్రేమ పేరుతో జరిగిన ఓ దొంగతనం కేసు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రియుడికి బర్త్డే గిఫ్ట్…