Vakkantham Vamsi : తెలుగు సినీ అభిమానులకు రచయితగా, దర్శకుడిగా వక్కంతం వంశీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈటీవీ లో మొదట వ్యాఖ్యతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వంశీ 1996లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా నటించాడు. తరువాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అశోక్ సినిమాతో మొదటిసారి రచయితగా చేసాడు. తరువాత వచ్చిన కిక్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు కథను అందించడమే కాకుండా దర్శకత్వం వహించారు. తన సినిమాల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు.
ఆ రెండు తప్పుల వల్లే సినిమా ఫ్లాప్…
తను చేసన సినిమాల గురించి తన దర్శకులు, హీరోల గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చిన వక్కంతం వంశీ గారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్ 2’ సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కిక్ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే, దాని సీక్వెల్ గా చాలా అంచనాల మధ్య వచ్చిన కిక్ 2 ఆశించినట్టుగా అలరించలేకపోయింది. సరిగా ఆడకపోవడానికి ఆ సినిమాను కిక్ సినిమాకి సీక్వెల్ అని చెప్పడం ప్రధాన కారణం అని వంశీ చెప్పుకొచ్చారు. రెండు కథలు వేరు వేరు అని, ఒక కథ అనుకోని దాన్ని అందరం సీక్వెల్ గా చూపించామని చెప్పారు. ఇక ఊరి జనాల ఎమోషన్ సరిగా చూపించకపోవడం రెండవ కారణం అని చెప్పుకొచ్చారు.
సురేందర్ రెడ్డితో చాలా సినిమాలు చేశానని, అందులో ‘ఏజెంట్’ సినిమా ఫ్లాప్ అవ్వడం చాలా బాధ వేసిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు కానీ అలా అవ్వడం చాలా బాధ వేసింది అని చెప్పుకొచ్చారు. ఇక సురేందర్ రెడ్డి గురించి చెబుతూ మొదట్లో ఇద్దరికీ కుదిరేది కాదు బాగా గొడవ అయ్యేది, తాను చాలా మొండిగా ఉండేవాడు అది చూసి నేను అలానే ఉండేవాన్ని. తరువాత చిన్నగా ఇద్దరికీ మంచి అవగాహన కుదిరింది. తనతో సినిమా చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా దానికి కారణం ఇద్దరం సమానంగా తీసుకుంటాం అని ఇద్దరి గురించి చెప్పారు.
ఇంటి లోపల చిన్నారి ఉంటే డైపర్లు వాడటం ఇప్పుడు సాధారణంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగస్త తల్లిదండ్రులకు ఇది ఎంతో సౌకర్యం…
ప్రపంచ ఆర్థిక గణాంకాలను ప్రభావితం చేసే ఒక అంశం “బంగారు నిల్వలు” (Gold Reserves). యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల…
ఇంట్లో చిన్నారి పుట్టిన క్షణం నుంచి ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు ఒక ముఖ్యమైన చర్చ కూడా…
కాలేయం (లివర్) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…
దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…