Vijayashanti: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి విజయశాంతి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి విజయశాంతి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈమె నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి ఇన్ని రోజులపాటు తనకు పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని దాచి పెట్టారని తెలుస్తోంది.గత కొంతకాలంగా ఈమెకు పాతిక సంవత్సరాల కొడుకు ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించడం విజయశాంతి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఈ వార్తలపై స్పందించిన విజయ్ శాంతి స్పందిస్తూ తాను
M.V. శ్రీనివాస్ను వివాహం చేసుకున్నానని తెలిపారు. అయితే తనకు పిల్లలు లేరనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఇలా లేని వారిని ఉన్నారని చూపించడం చాలా మూర్ఖత్వం ఇది తెలివిలేని వారు చేసే పని అని తెలిపారు.ఇక ప్రజా సేవ చేయడం కోసం తనకు పిల్లలు ఉంటే అడ్డుగా ఉంటుందని భావించిన తాను పిల్లలను వద్దనుకున్నానని ఈ సందర్భంగా విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను రాజకీయాలతో ఎన్నో బిజీగా ఉన్నానని ఇక మంచి కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే సినిమాలలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…