Visa will be canceled.. US Embassy strong warning..!
వాషింగ్టన్ D.C./హైదరాబాద్: అమెరికాలో దొంగతనాలు, దాడులు, దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని యూఎస్ ఎంబసీ తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నేరాలకు పాల్పడిన వారికి న్యాయపరమైన శిక్షలతో పాటు, వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని, అంతేకాకుండా మరోసారి అమెరికా రావడానికి వీలు లేకుండా డిటెన్షన్ కూడా విధిస్తామని స్పష్టం చేసింది. అమెరికాలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, విదేశీయులు కూడా ఇక్కడి చట్టాలను తప్పనిసరిగా పాటించాలని యూఎస్ ఎంబసీ ఒక పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.
ఈ హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలోనే, ఇటీవల ఇల్లినాయిస్ స్టేట్లో జరిగిన ఒక ఘటన వైరల్గా మారింది. ఒక భారతీయురాలు స్థానికంగా ఉన్న టార్గెట్ స్టోర్కు వెళ్లి ఏడు గంటల పాటు గడిపింది. దాదాపు రూ.11 లక్షల విలువైన వస్తువులను తన కార్ట్లో వేసుకుని, స్టోర్కు ఉన్న పశ్చిమ గేట్ నుంచి డబ్బులు చెల్లించకుండా పారిపోవడానికి ప్రయత్నించింది.
అయితే, ఆమె కదలికలపై అనుమానం వచ్చిన స్టోర్ సిబ్బంది అప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆ భారతీయురాలిని పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఆమె వారితో వాదించింది. “తానేమీ చేయలేదని, ఇంత చిన్న దానికే అరెస్ట్ చేస్తారా?” అంటూ మాట్లాడిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే యూఎస్ ఎంబసీ తాజాగా ఈ వార్నింగ్ను జారీ చేయడం గమనార్హం.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…