Featured

అయ్యో రామ.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుందనీ ఆస్పత్రికి వెళ్లాడు.. చివరికి ఇలా తిరిగి వచ్చాడు!

పండుగ సందర్భంగా ప్రతీ ఒక్కరి ఇల్లల్లో నాన్ వెజ్ వండుకొని తింటుంటారు. అదే ఆ రోజు స్పెషల్ అంటూ చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం లేచి.. స్నానం చేసి పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత బంధువులు, కటుంబసభ్యులతో కలిపి విందు భోజనం ఆరగిస్తారు. అయితే చికెన్, మటన్ తింటున్న సమయంలో చాలామంది జాగ్రత్తగా తినాలని చెబుతుంటారు.

ఎందుకంటే.. గొంతులో ఏమైనా ఇరుక్కుంటే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలు అంతకముందు ఎన్నో జరిగాయి కూడా. అందుకే జాగ్రత్తగా భోజనం చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. ఇలా ఓ వ్యక్తి పండుగ సమయంలో చికెన్ తింటున్న సమయంలో పొరపాటున చికెన్ ఎముక గొంతులో ఇరుక్కుని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అందియూరు సమీపంలోని కల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కల్లూరు గ్రామానికి చెందిన 56 ఏళ్ల సుబ్రమణ్యన్‌ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. దీపావళి పండగు రోజున అతడు తన స్నేహితుడు అయిన మునిరాజు భోజనానికి ఇంటికి ఆహ్వనించాడు. మునిరాజు ఇంట్లో ఇద్దరు కలిసి కోడి మాంసంతో అన్నం తిన్నారు.

ఆ సమయంలో సుబ్రమణ్యన్‌ ఓ చికెన్‌ ఎముక గొంతులో చిక్కుకుని ఇబ్బంది పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. దీంతో అతడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడు చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago