దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి పుట్టిన పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వారకు ఎవరినీ వదలడం లేదు. నవజాత శిశువులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నవజాత శిశువులకు కరోనా ఎలా సోకుతుందో మొదట్లో శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాలేదు. అయితే శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించగా ఆ అధ్యయనంలో కరోనా వైరస్ నవజాత శిశువులకు సోకడానికి సోకడానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి.
ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనా సోకిన శిశువుల్లో 30 శాతం మంది శిశువులు గర్భంలో ఉన్న సమయంలోనో లేదా ప్రసవ సమయంలోనో కరోనా బారిన పడుతున్నారని తేలింది. 176 పబ్లిష్డ్ కేసులను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. చాలామంది నవజాత శిశువులు ప్రసవం తరువాతే వైరస్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. గర్భంలో శిశువుకు కరోనా సోకడం అరుదుగా మాత్రమే జరుగుతుందని చెబుతున్నారు.
నవజాత శిశువులకు కరోనా వైరస్ సోకినా వాళ్లలో చాలా తక్కువగా మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని.. కరోనా శిశువులు జన్మించిన తరువాత సంభావ్య ముప్పును ఎదుర్కొంటున్నారా..? అనే ప్రశ్నకు పరీక్షల ద్వారా మాత్రమే సమాధానం లభిస్తుందని అన్నారు. 70 శాతం మంది శిశువులను ఆస్పత్రిలో తల్లి ద్వారా, ఇతర మార్గాల ద్వారా వైరస్ సోకుతున్నట్టు తేలిందని వెల్లడించారు.
మెడికల్ సిబ్బంది, బంధువులు, కరోనా రోగుల ద్వారా నవజాత శిశువులకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరోవైపు కరోనా మహమమరిని కట్టడి చేసే వ్యాక్సిన్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ కావడంతో వ్యాక్సిన్ మరింత ఆలస్యం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…