Categories: FeaturedGeneral News

ఎవరు ఈ తాలిబన్లు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..?

ఇప్పుడు ఎక్కడైనా నలుగురు కలిసి మాడ్లాడుకునే మాట తాలిబన్లు. ఆఫ్ఘానిస్తాన్ సైన్యం, ప్రభుత్వం తాలిబాన్ల దాటికి చేతులెత్తేయడంతో ఆఫ్ఘన్ ప్రజల పరిస్థితి ఇపుడు అగమ్య గోచరంగా మారింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తాలిబాన్ల పాలనలో తాము ఉండలేము అంటూ ఇప్పటికే వేల మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘన్ లో ఉన్న ఒక్కగానొక్క అంతర్జాతీయ విమానంలో దేశం విడిచి వెళ్ళిపోడానికి వేల మంది పోటీ పడటంతో అక్కడి బలగాలు గాల్లోకి కూడా కాల్పులు జరిపాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఒక దేశాన్ని తమ సైన్యంతో అదుపులోకి తీసుకున్న ఈ తాలిబన్లు ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకుందాం..

తాలిబన్ అంటే “విద్యార్థులు” అని అర్థం. వ్యవస్థాపక సభ్యుడు ముల్లా మహ్మద్ ఒమర్ విద్యార్థులు. 1994 సంవత్సరంలో ముల్లా మొహమ్మద్ ఒమర్ అంతర్యుద్ధం సమయంలో అవినీతిని సవాలు చేయడానికి డజన్ల కొద్దీ అనుచరులతో తాలిబన్‌ను స్థాపించారు. ఈ బృందం వాస్తవానికి “ముజాహిదీన్” అని పిలవబడే యోధుల నుండి సభ్యులను ఆకర్షించింది. వారు 1980 లలో ఆఫ్ఘనిస్తాన్ నుండి గతంలో USSR(ఇప్పుడు రష్యా) దళం నుంచి బయటకు వచ్చిన వారు. ఇది 1996 నాటికి దేశంలోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధించింది. 2001 లో సంవత్సరంలో వాళ్ల అరాచకాలకు అమెరికా స్పందించింది. తాలిబన్ల గ్రూపు ఎక్కడ ఉంటే అక్కడ అమెరికా సైనిక బలగాలు చెదరగొట్టాయి.

తర్వాత ముల్లా మహ్మద్ ఒమర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొదట శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులను, వివాహేతర సంబంధాలకు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు. దొంగతనాలకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించారు. మహిళలు బుర్ఖాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని హుకుం జారీ చేశారు. 10 ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్య పై ఆంక్షలు విధించారు. పరమత సహనం లేకుండా, ఇతర మతస్తుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. తాలిబన్లకు పుట్టినిల్లయిన పాకిస్తాన్ మదర్సాలలో చదివే వీరంతా ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాద చర్యలకు దిగారు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రశాంతంగా పాలన సాగిస్తారనుకుంటే ముజాహిదీన్ నాయకులను మించి తాలిబన్ల ఆటవిక పాలన సాగించారు.

అగ్రరాజ్యం అమెరికాపై 2001 సెప్టెంబరు 11న ఉగ్రదాడికి పాల్పడిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్తాన్‌లో స్థావరం ఏర్పరచుకున్నాడని అమెరికా తేల్చింది. అతడిని తమకు అప్పగించాలని తాలిబన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి ఆ ముఠా అంగీకరించలేదు. దాంతో 2001లో అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి. గత 20 ఏళ్లుగా తాలిబన్లతో పోరాటం సాగిస్తోంది అమెరికా. అయితే ఇటీవల యూఎస్ బలగాల ఉపసంహరణతో రెచ్చిపోయిన తాలిబన్లు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పై పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశం కావడంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారని వార్తలతో ప్రజల కళ్ళముందు తాలిబన్ల క్రూర పాలన కనిపిస్తోంది. ఇంతకాలం టీషర్ట్ లు , జీన్స్ వేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ యువకులు వాటిని తీసివేసి సంప్రదాయ దుస్తులను ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థినులు ఇక తాము చదువుకునే అవకాశం ఉండదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎయిర్ పోర్టులోకి ప్రజులు గుంపుగుంపులుగా వెళ్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలు ఆఫ్ఘన్ ప్రజలలో తాలిబన్ల పట్ల ఉన్న భయాందోళనలకు అద్దంపడుతున్నాయి. ఆఫ్ఘన్ లో ప్రాణ భయానికి నిదర్శనంగా కాబూల్ ఎయిర్పోర్టులో దృశ్యాలు కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లాలని ప్రజలు ఎయిర్ పోర్టుకు క్యూకడుతున్నారు. ఇలాంటి రాక్షస పాలను సాగిస్తున్న వారి చెర నుంచి తమను రక్షించాలని వాళ్లు వేడుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

12 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

12 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

14 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

14 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

15 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

15 hours ago