కె. ఆర్ విజయ ఒకప్పడు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో విజయ ఒకరు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. విజయ అసలు పేరు దైవనాయనకి ఈమె తండ్రి పేరు రామచంద్ర ఈయన తెలుగువాడే, అలాగే తన తల్లి కల్యాణి కేరళకు చెందిన అమ్మాయి.
విజయకు చిన్నప్పటి నుంచే నాటకాల అంటే ఎంతో ఇష్టం ఉండడం చేత ఎన్నో కార్యక్రమాలలో నాటకాలు వేస్తూ చెన్నై చేరుకున్నారు. ఈ విధంగా నటనపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి విజయ మొట్టమొదటిసారిగా ఎస్ గోపాల కృష్ణన్ దర్శకత్వంలో 1963 తమిళంలో “కర్పగమ్”అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో నటించే సమయంలోనే ఈమె పేరును దైవనాయకి కి బదులుగా తన తల్లి తండ్రి పేరు కలిసే విధంగా కె.ఆర్.విజయ అని పెట్టుకున్నారు.
ఈ విధంగా తమిళంలోకి అడుగు పెట్టిన ఈమె 1966 ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ పాండవీయం సినిమాల్లో నటించారు.ఈ సినిమాలో నటించే సమయానికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అదే ఏడాదలోనే విజయ తమిళ నిర్మాత, ఫైనాన్షియర్ సుదర్శన్ వేలాయుధమ్ సినిమాలో విజయ నటించారు. ఈ సినిమా కారణంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ ఆ తర్వాత క్రమంగా బలపడుతూ పెళ్లి వరకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు. అందుకు గల కారణం ఏమిటంటే.. ఈమె ఆ నిర్మాతను పెళ్లి చేసుకున్న సమయానికి ఈమె ఇంకా మైనర్ కావడంతో తన పెళ్లి విషయం గురించి ఎక్కడా చెప్పలేదు.
ఈ క్రమంలోనే విజయ గర్భిణిగా ఉన్నప్పుడు వేలాయుధమ్ తనను పర్యటన కోసమని ఫ్లైట్లో తీసుకు వెళ్ళాడు. అప్పటికే అతనికి ఒక సొంత జట్ ఫ్లైట్ ఉండేది. ఈ విధంగా పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి వీరి ఫోటోలను తీయడంతో ఆ ఫోటోలు మరుసటి రోజు ప్రతి ఒక్క పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలోనే విజయ వివాహం చేసుకుందనే విషయం బయటపడింది.పెళ్లి తర్వాత కూడా తన భర్త ప్రోత్సాహం వల్ల ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…