సినిమా ఇండస్ట్రీలోకి టి.రాజేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ సాగరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా నళిని పరిచయమయ్యారు. ఈ సినిమా విజయవంతం కావడంతో చిరంజీవితో కలిసి సంఘర్షణ, ఇంటి గుట్టు అనే సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు.ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమె హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.
నళిని హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉన్న సమయంలో తమిళ స్టార్ నటుడు అయిన రామరాజన్ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలు తీసుకున్నారు. ఈమెకు ఒక కొడుకు అరుణ్, కూతురు అరుణ ఉన్నారు. ఈ విధంగా కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నఈమె తిరిగి మరి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు టీవీ షోలు టీవీ సీరియల్స్ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను సందడి చేసిన ఈమె తన వైవాహిక జీవితంలో కొన్ని రోజుల పాటు సంతోషంగా గడిపిన తిరిగి తన భర్తతో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికే పిల్లలు తరచూ తన తండ్రి దగ్గరికి వెళ్లి వచ్చే వారని తెలిపారు.
ఈ క్రమంలోనే నళిని కూతురు ఓ సందర్భంలో మాట్లాడు తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే కూతురు అరుణ మాట్లాడుతూ వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ ఒకరిపై ఒకరు ఎంతో గౌరవంగా ఉండే వారని ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకునే వారు కాదని తెలిపింది. ఈ క్రమంలోనే కోర్టులో న్యాయమూర్తి వీరికి విడాకులు మంజూరు చేసినట్లు తీర్పు వెల్లడించడంతో అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే నాన్న వచ్చి పట్టుకున్నారని, ఈ విధంగా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోతూ ఇంత ప్రేమ ఉన్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అంటూ సందేహం వ్యక్తం చేశారని తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ గురించి తెలియజేశారు.
వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…
హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…
రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…
రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…