Yandamuri Veerendhranath : తెలుగులో నవలా రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీదళం వంటి ఎన్నో నవలలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధిచిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యాసంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందించ్చేవరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
చరణ్ ను అన్నందుకు చిరంజీవి హర్ట్ అయ్యాడు…
చాలా సందర్భాల్లో యండమూరి చెప్పిన విషయం ఆయన నవలలో హీరో ఎపుడూ చిరంజీవి అని. చిరంజీవి ని హీరోగా అనుకునే కథలను రాస్తాను అంటూ చెబుతారు. ఆయన నవలలో కొన్ని చిరంజీవి హీరోగా సినిమాలు వచ్చి హిట్ అయినవి ఉన్నాయి. ఇక చిరంజీవి తో మంచి సంబంధాలు ఉన్న యండమూరి గారు ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ వల్ల చిరంజీవి హర్ట్ అయ్యాడని చెప్పారు. ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కూడా ఇప్పుడు వద్దు రాజకీయ పార్టీ ముందు సేవ చేసి జనాల్లోకి వెళ్ళు అని చెప్పిన వారిలో నేనూ ఉన్నాను అంటూ యండమూరి గారు వివరించారు.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ నిర్మాత దేవి వర ప్రసాద్ గురించి మాట్లాడుతూ ‘మృగరాజు’ సినిమా వల్ల దేవి వర ప్రసాద్ కోలుకోలేని దెబ్బ తిన్నడంటూ తెలిపారు. ఇంగ్లీష్ సినిమా ఇన్స్పిరేషన్ తో వచ్చిన ఆ సినిమాలో గుణశేఖర్, నాగబాబు ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేయగా నేను కేవలం కొన్ని సన్నివేశాలకు మార్పులు చేర్పులు చేయించాను అంటూ చెప్పారు యండమూరి, ఆ సమయంలో నా కొడుకు పెళ్లి కోసం డబ్బు అవసరం అయితే చిరంజీవి దేవి వరప్రసాద్ తో ఇప్పించాడు. నేను సినిమాకు కొన్ని సన్నివేశాలు చెప్పాను అంటూ కానీ ఆ సినిమా అంచాలను తప్పింది, దీంతో దేవి వరప్రసాద్ ఆర్థికంగా దెబ్బతిన్నాడు అంటూ చెప్పారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…