Mahi v raghav: మహీ వి రాఘవన్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు .తాజాగా ఈయన దర్శకత్వం వహించినటువంటి యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ ప్రవేశం గురించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ మహి.
ఇక ఈయన యాత్ర సినిమాకు అంతంత మాత్రమే ఆదరణ వస్తుంది కేవలం వైఎస్ అభిమానులు మాత్రమే ఈ సినిమాని చూస్తున్నారు. ఇక ఈ సినిమా పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా చేసినందుకుగాను ఈయన ఏపీ ప్రభుత్వం నుంచి రెండు ఎకరాల స్థలాన్ని కానుకగా తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. అయితే గతంలోనే డైరెక్టర్ హార్స్లీ హిల్స్ ప్రాంతంలో స్టూడియో నిర్మాణం కోసం తనకు రెండు ఎకరాల స్థలం కావాలి అంటూ సీఎంని కోరిన సంగతి తెలిసిందే.
ఇలా జగన్ యాత్ర సినిమా చేసినందుకు గాను డైరెక్టర్ కు కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని రాసిచ్చారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై డైరెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా మహి ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను మదనపల్లిలో పుట్టి పెరిగాను ఇక్కడే చదువుకున్నాను. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది అని తెలిపారు.
రాయలసీమకు చేసిందేమీ లేదు…
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ రాయలసీమకు మాత్రం ఏ చిన్న సహాయం చేయలేకపోయిందని తెలిపారు. అందుకే నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే హార్స్లీ హిల్స్లో రెండు ఎకరాల స్థలం అడిగానని తెలిపారు. అందరిలా నేను ఏ 100 ఎకరాలు 50 ఎకరాలు స్థలం అడగలేదు ఇక్కడ ఓ మినీ స్టూడియో కట్టడం కోసం కేవలం రెండు ఎకరాలు మాత్రమే అడిగానని గత ప్రభుత్వాలు వాళ్ల వారికి ఇచ్చిన విధంగా నేనేమి అడగలేదు అంటూ ఈయన ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…