Mahi v raghav: మహీ వి రాఘవన్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు .తాజాగా ఈయన దర్శకత్వం వహించినటువంటి యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ ప్రవేశం గురించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ మహి.
ఇక ఈయన యాత్ర సినిమాకు అంతంత మాత్రమే ఆదరణ వస్తుంది కేవలం వైఎస్ అభిమానులు మాత్రమే ఈ సినిమాని చూస్తున్నారు. ఇక ఈ సినిమా పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా చేసినందుకుగాను ఈయన ఏపీ ప్రభుత్వం నుంచి రెండు ఎకరాల స్థలాన్ని కానుకగా తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. అయితే గతంలోనే డైరెక్టర్ హార్స్లీ హిల్స్ ప్రాంతంలో స్టూడియో నిర్మాణం కోసం తనకు రెండు ఎకరాల స్థలం కావాలి అంటూ సీఎంని కోరిన సంగతి తెలిసిందే.
ఇలా జగన్ యాత్ర సినిమా చేసినందుకు గాను డైరెక్టర్ కు కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని రాసిచ్చారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై డైరెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా మహి ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను మదనపల్లిలో పుట్టి పెరిగాను ఇక్కడే చదువుకున్నాను. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది అని తెలిపారు.
రాయలసీమకు చేసిందేమీ లేదు…
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ రాయలసీమకు మాత్రం ఏ చిన్న సహాయం చేయలేకపోయిందని తెలిపారు. అందుకే నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే హార్స్లీ హిల్స్లో రెండు ఎకరాల స్థలం అడిగానని తెలిపారు. అందరిలా నేను ఏ 100 ఎకరాలు 50 ఎకరాలు స్థలం అడగలేదు ఇక్కడ ఓ మినీ స్టూడియో కట్టడం కోసం కేవలం రెండు ఎకరాలు మాత్రమే అడిగానని గత ప్రభుత్వాలు వాళ్ల వారికి ఇచ్చిన విధంగా నేనేమి అడగలేదు అంటూ ఈయన ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…