ప్రస్తుత సమయంలో కొంతమందికి చేతిలో సినిమాలు లేకున్నా సోషల్ మీడియా వేదికగా నిత్యం ఫ్యాన్స్ కు నటీమణులు టచ్ లో ఉంటున్నారు. అంతేకాకుండా తమ అందాలను ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకునే పేరు హాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ . అయితే ఈమె జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తోన్న సమయంలో ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అందరూ ఆమె వివాహం గురించి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా జార్జ్ పనాయొటోతో ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పేసిందని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకుందట. ఇలా పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె గురించి కొన్ని రోజులు హాట్ టాపిక్ అయింది. విదేశీ అమ్మాయి అయినా ఇండియాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మొదట ఈమె మద్రాసీ పట్టణం అనే తమిళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఇందులో బ్రిటీష్ యువరాణి పాత్రను పోషించిన ఈ అమ్మడు.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
తర్వాత రామ్ చరణ్ సరసన ఎవడు మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తర్వాత శంకర్ దర్శకత్వం వహించిన ఐ సినిమాలో కూడా నటించి మెప్పించింది. తర్వాత ‘రోబో 2.0′ సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈమెకు ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా ఆమె పెట్టే ఫొటో షూట్ మాత్రం వైరల్ గా మారుతాయి. ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ బ్యూటీ కదా.
ఫలితంగా ఆ పిక్స్కు కొన్ని లక్షల్లో లైకులు రావడంతో పాటు అమీ జాక్సన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ గణణీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఇలా ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఇలా ఆమె ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…