దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా కేసుల సంఖ్య పెరగడం లేదు. కరోనా బాధితుల వైద్య చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతూ ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు 1,33,080 మంది లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయల చొప్పున రుణం పొందారని వెల్లడించారు. రుణం పొందిన వాళ్లలో తెలంగాణకు చెందిన వాళ్లు 3,389 మంది ఏపీకి చెందిన వాళ్లు 2,791 మంది ఉన్నారని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే ఈ రుణాలను టర్మ్ రుణాలుగా పరిగణిస్తారని కేంద్రం తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు మంజూరు చేసిన ఈ రుణాలను మూడు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించడం గమనార్హం. సమీపంలోని ప్రభుత్వ రంగ బ్యాంకును సంప్రదించి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
కరోనా సోకి చికిత్సకు ఎక్కువ మొత్తం ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడితే ఈ విధంగా సులభంగా రుణాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గినా జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…