YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే .ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన జరగబోయే ఎన్నికల గురించి గత ఐదు సంవత్సరాల పాలన గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానికి మద్దతు తెలిపారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెర పైకి తీసుకువస్తారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి మాట్లాడుతూ తాను విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తానని అక్కడే ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. అయితే విశాఖను రాజధానిగా ప్రకటించడానికి కారణాలను కూడా తెలియజేశారు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయాలంటే ఒక ఎకరం మీద దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే అమరావతి అనేది గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక మన ఏపీలో విశాఖ అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో మన ఏపీకి విశాఖ అలాగా ఉంటుంది ఈ అభివృద్ధి చెందినటువంటి సిటీకి మనం కాస్త బూస్ట్ ఇస్తే ప్రస్తుతం ఒక హైదరాబాద్ బెంగళూర్ చెన్నై లాగా రూపుదిద్దుకుంటుందని ఆ ఒక్క కారణంతోనే తాను విశాఖను రాజధానిగా ప్రకటించానని జగన్ తెలిపారు.
అభివృద్ధి చెందిన నగరం..
ఇక ఈ ఐదు సంవత్సరాల కాలంలో తన పరిపాలన గురించి కూడా మాట్లాడారు తాను అధికారంలోకి రాకముందు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలను కల్పించాను కళ్ళముందే మన ఉద్యోగులందరూ కూడా కనపడుతున్నారని తెలిపారు. అలాగే జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి కూడా పూర్తిగా వివరించారు అభివృద్ధి జరగలేదన్న వారికి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జగన్ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…