YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లిలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పై ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ముఖ్యంగా కొంతమంది ఐ టీడీపీ బ్యాచ్ తో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి తన తల్లి గురించి చెల్లి షర్మిల అలాగే తన పట్ల చేస్తున్నటువంటి పోస్టులపై ఈయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు తన ఐ టిడిపి బ్యాచ్ తో ఇలా ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయించి తన కుటుంబం గురించి ఎంతో అసభ్యకరంగా పోస్టులు చేయిస్తున్నారు. బాలకృష్ణ చేత తన చెల్లి పై తప్పుడు ప్రచారాలను కూడా చేయించారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నీకు కూడా ఓ కుటుంబం ఉంది కదా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా తన తల్లిదండ్రులను ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయలేదు కనీసం వారిని ఒక్క పూటైనా నీ ఇంటికి పిలిచి కడుపునిండా భోజనం పెట్టవా మీ తల్లిదండ్రులు చనిపోతే వారికి తలకొరివి కూడా పెట్టలేదు అంటూ మండిపడ్డారు. ఇక అక్రమంగా సోషల్ మీడియా వైసిపి కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఇక వర్మ సెన్సార్ బోర్డు అనుమతి తీసుకుని సినిమా చేశారని ఈయన గుర్తు చేశారు.
ఆయన సినిమా చేయడానికి సెన్సార్ బోర్డు అనుమతి ఉంది. ఇప్పుడు తనపై కూడా కేసులు పెడుతున్నారని జగన్ గుర్తు చేశారు. కేవలం మీ టీడీపీ ఎల్లో బ్యాచ్ చేసినవే సినిమాలా అంటూ కూడా మండిపడ్డారు. ఇలా జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ హామీల గురించి అలాగే తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఉన్న అప్పుల గురించి ఇక ప్రస్తుతం ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తల గురించి కూడా మండిపడుతూ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు వేశారు.
మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న వేళ, ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్కి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ పానీయాలపై మళ్లీ దృష్టి పడుతోంది.…
వేసవి తాపానికి సహజ చల్లదనం అందించే మట్టి కుండలు… ఆరోగ్యానికి మేలు చేసే ఈ సంప్రదాయ విధానంలో జాగ్రత్తలు తప్పనిసరి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ అధినేత వైఎస్ జగన్…
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో నిర్వహించిన ఎన్పీ సావిత్రమ్మ…
యంగ్ హీరో అడవి శేష్ నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’ విడుదలకు ముందే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…