సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసిన బ్రహ్మోత్సవం ఆయన ఫాం కి గట్టి బ్రేక్ వేసింది. సక్సెస్ లలో ఉన్న దర్శకులకి అవకాశాలిచ్చే మహేష్ అదే ఈ సినిమాకి ఫాలో అయ్యాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. దిల్ రాజు తీసుకు వచ్చాడంటే ఖచ్చితంగా ఆ దర్శకుడికి మంచి టాలెంట్ తో పాటు స్టార్ హీరోలను డీల్ చేయగల సత్తా కూడా ఉంటుందని అందరూ గట్టిగా నమ్ముతారు. అందుకు ఉదాహరణ సుకుమార్, వంశీపైడిపల్లి లాంటివారే. అలాగే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల మీద ఇండస్ట్రీ వర్గాలతో పాటు హీరోలకి మంచి నమ్మకం ఏర్పడింది.
హ్యాపీడేస్ తర్వాత వరుణ్ సందేశ్ కి టాలీవుడ్ లో యంగ్ హీరోగా మంచి క్రేజ్ వచ్చిది. దాంతో ఈ హీరోతో కొత్త బంగారులోకం అనే సినిమా నిర్మించాడు దిల్ రాజు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. అలాగే హీరోయిన్ గా శ్వేత బసుప్రసాద్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో శ్రీకాంత్ అడ్డాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. అదే సినిమాతో రావు రమేశ్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ సినిమాకి కథ రాశాడు. అదే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.
దిల్ రాజు కాబట్టి ఈ సినిమా వచ్చింది గానీ వేరే నిర్మాత అయితే అంత సులభంగా ఈ సినిమాను నిర్మించే వారు కాదేమో. బాలీవుడ్ సినిమాల ప్రేరణతో దర్శకుడు కథ రాసుకున్నాడు. హిందీలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు మొహబ్బతేన్, కభీ ఖుషీ, కబీ ఘం లాంటి సినిమాల తరహాలో భారీ తారగణంతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపొందించారు. ఈ కథలో ఏమాత్రం మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా కంప్లీట్ గా క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని మొండి ధైర్యంతో ఈ సినిమాను నిర్మించారు. లక్కీగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం విశేషం.
అయితే ఇదే ఆలోచనతో మరోసారి భారీ తారాగణంతో బ్రహ్మోత్సవం సినిమా తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. పి వి పి, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ బ్యానర్స్ లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ కూడా భాగస్వామి. కాజల్, ప్రణీత, రావు రమేశ్, సత్యరాజ్, ఇలా పెద్ద స్టార్ కాస్టింగ్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాకి కావాల్సిన బలమైన కథే లేదు. దాంతో సినిమా చూసిన ప్రేక్షకుడికి బుర్ర చెడి బయటకు వచ్చారు. ఫస్ట్ షోకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి ముందు మహేష్ కొరటాల శివతో శ్రీమంతుడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.
ఆ ప్రభావం కూడా బ్రహ్మోత్సవం మీద పడి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అందరూ కలిసుండాలి అనే పాయింట్ తప్ప ఎంతమాత్రం ఆడియన్స్ ని మెప్పించలేని కథ, కథనంతో దర్శకుడు బ్రహ్మోత్సవం తీసి ట్రోల్స్ కి గురయ్యాడు. ఈ సినిమా రిజల్ట్ చూసి మళ్ళీ అవకాశలివ్వడానికి మేకర్స్ కి ధైర్యం చేయలేకపోయారు. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో మహేష్ ఇందులో ఒక పార్టనర్ కాబట్టి ఆయనకి బాగానే నష్టం వచ్చిందని టాక్ వినిపించింది. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల వెంకటేశ్ హీరోగా నారప్ప సినిమాను రూపొందంచాడు. ఇటీవల రిలీజైన ఈ సినిమాకి అంత ఆశాజనికంగా రివ్యూస్ రాలేదు. ఒకరకంగా దర్శకుడు ఈ సినిమాను సరిగ్గా తీయలేకపోయాడని టాక్ వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…