1990 దశకం ఈ సంవత్సరం అనేక విజయవంతమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడిందని చెప్పవచ్చు. మూడు రకాలైన సినిమాలు సినీ ప్రేక్షకులను ఉత్తేజ పరచాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, బొబ్బిలిరాజా, కర్తవ్యం ఈ మూడు చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి.
సురేష్ ప్రొడక్షన్స్ వారు వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నారు. ఆ క్రమంలో కథ కోసం పరుచూరిబ్రదర్స్ ను సంప్రదించారు. ముందుగా ఒక కలెక్టర్ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథా చిత్రాన్ని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. దానికి అంతగా స్పందించని సురేష్ ప్రొడక్షన్స్ వారు అడవి నేపథ్యంలో ఓ కథ కావాలన్నారు. అలాంటి సమయంలో వారు అడవి నేపథ్యంతో “బొబ్బిలిరాజా” కథను చెప్పడంతో సురేష్ ప్రొడక్షన్స్ వారు అంగీకరించి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. అలాంటి కథకు దర్శకుడు ఎవరైతే బాగుంటుందని నిర్మాత సురేష్ బాబు అడగడంతో తమ బ్యానర్ లో పరిచయమైన బి.గోపాల్ బాగుంటుందని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. బి.గోపాల్ ను తీసుకుందామని అనుకున్నప్పటికీ ఈ కథలో వచ్చే ప్రేమతో కూడిన సన్నివేశాలను హీరో, హీరోయిన్ల మధ్య బి.గోపాల్ చక్కగా చిత్రించ గలడా అనే సందేహం నిర్మాత సురేష్ బాబుకి వచ్చింది. కానీ పరుచూరి బ్రదర్స్ నచ్చజెప్పడంతో బి.గోపాల్ ని తీసుకోవడానికి సురేష్ బాబు ఒప్పుకున్నారు.
ఈ సినిమా మొత్తం అత్త పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. కావున కథలో బలమైన అత్త పాత్ర కు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో ముందుగా శారదను అనుకున్నారు కానీ అంతకుముందే అత్త పాత్రలు వేయడంతో ఆమె స్థానంలో వాణిశ్రీ ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాకి రచయిత, దర్శకుడు, హీరో ఎంపిక జరిగింది కానీ హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో “రాధ” అయితే బాగుంటుందని డి.రామానాయుడు సూచించారు. కానీ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి ఒక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పడంతో ముంబైలోని బోనికపూర్ కి ఫోన్ చేసి తాము తీయబోయే కొత్త సినిమాకి హీరోయిన్ కావాలని చెప్పడంతో కొన్ని ముంబైలోని హీరోయిన్స్ ఫొటోస్ ని పంపించడం జరిగింది.
సురేష్ ప్రొడక్షన్ ఆఫీసులో ఫోటోస్ చూస్తున్న క్రమంలో దివ్యభారతి ఫోటోను చూసి ఈ అమ్మాయి బాగుంది, మన సినిమాల్లో హీరోయిన్ గా ఈ అమ్మాయిని పెట్టేద్దాం అని రచయిత గోపాలకృష్ణ అనడంతో నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేష్ కూడా ఒప్పుకున్నారు. అలా ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఆ తర్వాత సినిమా విడుదల విజయవంతం అయ్యింది. ఆ తర్వాత చిరంజీవితో రౌడీ అల్లుడు, మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు, బాలకృష్ణతో ధర్మక్షేత్రం లాంటి హిట్ చిత్రాల్లో దివ్యభారతి నటించింది. అలా వివిధ రకాలైన సినిమాలలో నటిస్తూ తన సిని పరంపరను కొనసాగిస్తూ.. ప్రశాంత్ హీరోగా “తొలిముద్దు” సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న క్రమంలో ఆమె ముంబైలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…