దక్షిణాది కథానాయికల్లో అత్యంత పారితోషకం తీసుకునే వారిలో నయనతార ఒకరు. తెలుగులో బాలయ్య లాంటి వాళ్ళు పట్టుబట్టి మరీ అడిగినంత ఇప్పిస్తున్నారు గానీ చాలా వరకు తెలుగు సినిమాలలో ఆమె కనిపించకపోవడానికి కారణం కూడా ఆమె పారితోషకమే..
అయితే కొన్ని పాత్రలకే నయనతార బాగా న్యాయం చేస్తుందని, ఆమె తప్ప వేరే అప్షన్ లు లేకపోవడంతో ఆమె అడిగినంత ఇచ్ఛుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఇటీవలే విడుదలైన సూపర్ స్టార్ రజని కాంత్ సినిమా “దర్బార్” లోను నయనతార నటించిన విషయం అందరికి తెలిసినదే.. అయితే ఈ చిత్రానికి గాను నయనతార పారితోషకం 5 కోట్లు. రజని కాంత్ సినిమా, పైగా మురుగుదాస్ దర్శకుడు అయినా కూడా ఏమాత్రం తగ్గలేదట ఈ అమ్మడు.
అలాగని రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్ర కూడా కాదు. పెద్దగా డైలాగులు కుడా లేవు, మాహా అయితే ఒక ఏడెనిమిది సీన్లలో కనిపించింది. రజనితో కలిసి ఒక పాటకి కూడా స్టెప్పులు వేసిందండోయ్.. అంతే ఆమాత్రానికే ఈ అమ్మడు కి 5 కోట్లు సమర్పించారట నిర్మాతలు. దీనిని బట్టి ఆమె క్రేజ్ ఏపాటిదో అర్ధం అవుతుంది. నయనతార మజాకా !!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…