తాజగా తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఈ నేపద్యంలో లాక్ డౌన్ సందర్బంగా విధించిన అన్ని రకాల నిబంధనలను ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినేట్ ఆదేశించింది. దీనితో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో సన్నద్దమై జూలై 1 నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సీఎం కేసీఆర్ అద్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనాను నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది.
ఈ క్రమంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను యధావిధిగా పాటించాలని కోరింది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…