సినిమా రంగంలో ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వాటంతట అవే వచ్చి వాలుతాయి. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేదు.. ఎక్కడైనా ఒక్కటే.. హీరోగా మంచి క్రేజ్ సంపాదిస్తే చాలు.. ఆ క్రేజ్ ను వాడుకునేందుకు ముందుకు వస్తాయి పలు మల్టీ నేషనల్ కంపెనీలు. వారిని తమ బ్రాండ్ల ప్రచార కర్తలుగా మార్చుకుని అవి లాభం పొందుతూ హీరోలకు భారీగా డబ్బులు ముట్టజెప్తున్నాయి.
తెలుగు హీరోలు సైతం ఈ పద్దతిలోడబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ లో చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. సినిమాలలో నటించినందుకు కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు.. వాణిజ్య ప్రకటనలకు సైతం భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతకీ తెలుగు సినిమా నటులు యాడ్స్ లో నటించినందుకు ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒకే యాడ్ లో నటించాడు. అదీ మహేంద్ర కంపెనీకి చెందిన టియువి 300కార్ కి సంబంధించిన యాడ్. ఇందుకు గాను తను రెండు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు.
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు తను దాదాపు 10 యాడ్స్ చేస్తున్నాడు. ఒక్కో యాడ్ క రెండు కోట్ల రూపాయల చొప్పున తీసుకుంటున్నాడట. ఈ సొమ్మును చిన్న పిల్లల గుండె సంబంధ వ్యాధుల నిర్మూలన కోసం వాడుతున్నాడట.
జూ. ఎన్టీఆర్
నవరత్న హెయిర్ ఆయిల్, మలబార్ గోల్డ్, జండూ బామ్ సహా పలు యాడ్స్ చేశాడు. ఒక్కొక్క యాడ్ కి కోటి రూపాయల వరకు డబ్బులు తీసుకన్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్
రామరాజు కాటన్, మణప్పుర గోల్డ్ లోన్ వంటి యాడ్స్ లో వెంకటేష్ నటించాడు. ఒక్కొక్క యాడ్ కి కోటి రూపాయల వరకూ చార్జ్ చేశాడట.
నాగార్జున
కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ లో కనిపించే కింగ్ నాగార్జున కోటిన్నర వరకూ తీసుకున్నాడట. దీనితో పాటు గడీ డిటడ్జెంట్ సహా పలు యాడ్స్ లో ఆయన నటించాడు.
అల్లు అర్జున్
రెడ్ బస్, క్లోజ్ అప్, OLX యాడ్స్ లో నటటించాడు అల్లు అర్జున్. తాజాగా ప్రూటీ యాడ్ లో అలియా భట్ తో కలిసి నటించేందుకు కోటిన్నర తీసుకుంటున్నాడట.
నాగచైతన్య
చెన్నై షాపింగ్ మాల్, రెక్సోనా, క్లోజప్ యాడ్స్ లో చేశాడు నాగ చైతన్య. ఒక్కో యాడ్ కి 70 లక్షల వరకూ తీసుకుంటున్నాడట.
రానా
రిలయన్స్ ట్రెండ్స్, జంగ్లీ రమ్మీ, ఓ మద్యం యాడ్ చేశాడు రానా. ఒక్కో యాడ్ కి కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…