సీనియర్ హీరోయిన్ త్రిష పనైపోయిందా.. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ముఖ్యంగా తెలుగులో త్రిషకు ఇక అవకాశాలు దక్కడం చాలా కష్టం అని చెప్పుకుంటున్నారు. ఒక రకంగా ఈ టాక్ గతంలోనే వచ్చింది. కానీ, త్రిష అదృష్ఠం కొద్దీ తమిళంలో 96 సినిమా పడింది. ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి త్రిషకు జంటగా నటించాడు. అనూహ్యంగా 96 సినిమా యూత్ ఆడియన్స్ను మాత్రమే కాకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
96 సక్సెస్తో త్రిష మంచి కంబ్యాక్ అయింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న త్రిష అలాగే తమిళం నుంచి వరుసగా అవకాశాలు అందుకుంది. గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం సినిమాలో త్రిష ఓ కీ రోల్ చేస్తోంది. ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్కు రెడీ అవుతోంది. అలాగే దీని సీక్వెల్ లోనూ త్రిష నటిస్తోంది. ఇది పాన్ ఇండియన్ సినిమా. అన్నీ భాషలలో డబ్ అవుతుంది.
కాబట్టి పొన్నియన్ సెల్వన్ సీక్వెల్స్ కొంతవరకు త్రిషకు హెల్ప్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక మలాయళంలో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పటికే తమిళంలో రాంగి, గర్జనై, సతురంగ వెట్టై సీక్వెల్ సినిమాలలో త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ మూడు సినిమాల షూటింగ్ కూడా పూర్తైంది. అంటే త్రిష చేతిలో ఉంది కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఇవన్నీ లాక్ డౌన్ కి ముందే ఒప్పుకొన్నవి. అవే షూటింగ్ కంప్లీట్ చేసింది.
కొత్తగా చేయబోయేది అంటే మణిరత్నం తెరకెక్కించనున్న పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ ఒక్కటే. అందుకే ఇకపై త్రిషకు హీరోయిన్గా కంటే అత్త పాత్రలకు అవకాశాలు వస్తాయనే టాక్ మొదలైంది. ఫేడౌవుట్ అయిన హీరోయిన్స్ అందరూ నటించానే కోరిక ఉంటే అత్త అమ్మ పాత్రలే దక్కుతాయి. ప్రస్తుతం తెలుగులో త్రిషకు అవకాశాలు సున్నా. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయింది.
ఈ సినిమా గనక చేసి ఉంటే మళ్ళీ తెలుగులో ఈ సీనియర్ హీరోయిన్కు అవకాశాలు దక్కేవేమో. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారికి హీరోయిన్ సమస్య బాగా ఉంది. కాబట్టి దర్శక, నిర్మాతలు కాస్త ఆలోచిస్తే.. హీరోలు ఓకే చేస్తే త్రిషకు తెలుగులో అవకాశాలు తలుపు తడతాయి. లేదంటే ఇకపై నెమ్మదిగా టాలీవుడ్ను మర్చిపోవడమే. మరి హీరోయిన్గా అవకాశాలు రాకుంటే అత్త పాత్రలను చేస్తుందా అంటే అందుకు త్రిష ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…