తనని హెరేస్ చేసాడని యస్పి చరణ్ మీద కేసు పెట్టిన ఆ సౌత్ భామ ఎవరో తెలుసా…?
సంఘంలో మంచి పేరు సంపాదించి ,పరువుగా బతికే ఎలాంటి వాళ్లైనా, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే గొడవని పెదద్ది చేయకుండా సాధ్యమైనంత వరుకూ బైటపడడానికే చూస్తారు. అలాంటి ఒక ఇన్సిడెంట్ ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుహ్మణ్యం తనయుడు చరణ్ విషయంలో్ జరిగింది. అతడు 2011లో ఒక కేసులో ఇరుక్కున్నాడు. అతడి మీద కేసు పెట్టింది తమిళ్ నటి సోనా . చరణ్ గాయకుడిగా సౌత్ స్క్రీన్ కు పరిచయమై, నటుడిగానూ వేషాలేసి, చివరికి నిర్మాతగా పలు సినిమాలు తీసి చేతులు కాల్చుకొన్నాడు. బాలసుబ్రహ్మణ్యం కొన్ని చరణ్ సినిమాలకు ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చి ఆయనకూడా నష్టపోయారు. అది సరిపోదన్నట్టు .. 2011లో అజిత్ నటించిన 50 వ చిత్రం మంగాతా సక్సెస్ సెలబ్రేషన్స్ చెన్నైలో జరిగాయి. ఆ సందర్భంగా అందులో నటించిన నటీనటులంతా కలిసి ఒక పార్టీ ఏర్పాటుచేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ పార్టీ తెలుగు వెటరన్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ ఇంట్లో జరుగుతోంది. అందులో దర్శకుడు వెంకట్ ప్రభు, అతడి తమ్ముడు ప్రేమ్ జీ అమరన్, బాలు కొడుకు చరణ్ పార్టిసిపేట్ చేసారు.
యస్పీ చరణ్ మధ్యం బాగా సేవించిఉండడం వల్ల, ఆ మత్తులో మంగాతా లో నటించిన నటీమణి సోనాతో అసభ్యంగా ప్రవర్తించాడట. సోనా అంటే తమిళ్ లో నటి గా ప్రవేశించి, ఆ తర్వాత వ్యాంప్ గా మారిన నటీమణి. ఆ సంఘటన జరిగిన వెంటనే ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ని గ్రేటర్ చెన్నై పోలీస్ కమీషనర్ కి అందించి, చరణ్ మీద కేస్ చార్జ్ చేయమని రిక్వస్ట్ చేసింది. సౌందరపాండియ నగర్ అంగాడి పోలీస్ కేసు రిజిస్టర్ చేసుకున్నాడు. చరణ్ తను చేసిన తప్పుకు పోలీస్, ప్రెస్ ముందు క్షమాపణ చెప్పుకోవాలని డిమాండ్ చేసింది. కానీ చరణ్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. దాంతో ఈ కేసులో యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇన్వాల్వ్ అయి, చరణ్ చేత పర్సనల్ గా సోనాకి క్షమాపణ చెప్పించారని , ఆ తర్వాత కేసుని క్లోజ్ చేయించారని అప్పట్లో చెప్పుకున్నారు. ఈ పరిణామం తర్వాత సోనా కొన్ని రోజులు దేషం విడిచి పెట్టి వెళ్లారు. ఏదేమైనా ఈ వ్యవహారం బాలసుబ్రహ్మణ్యం లాంటి సెలబ్రిటీ కి పెద్ద తలనొప్పనే చెప్పుకోవాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…