Categories: Movie News

పేరుకు టాప్ హీరోయిన్ నటుడిని పెళ్లి చేసుకుంది కాని విడాకుల కోసం కోర్టుకెక్కారు

కోర్టు బోనులో స్రృహతప్పి పడిపోయిన మరోచరిత్ర హీరోయిన్
సరిత…. దక్షిణాది వెండితెరపై ఒకప్పుడు ఆమె అద్భుతనటీమణి, దానితో పాటు వినసొంపైన గాత్రంతో ఎందరో హీరోయిన్స్ కు గాత్రదానం చేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆమె అంత అందంగా ఉండకపోవచ్చు కానీ,ఎంతో ఆకర్షణీయమైన ముఖం ఆమెది.

ఆమె సినీకొలను లో విరిసిన నల్లకలువ అని అప్పట్లో చెప్పుకొనేవారు. తెలుగు, తమిళ్, మలమాళం తో పాటు కన్నడ లో కూడా లెక్కకు మించిన సినిమాలు చేసింది, ఎందరో తమిళ్, తెలుగు నటీమణులకు డబ్బింగ్ చెప్పింది. ఆమె సౌత్ స్ర్కీన్ పై దాదాపు 151 సినిమాల్లో నటించింది. అన్ని భాషాల్లోనూ కలుపుకొని ఆమె మొత్తం 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 9 ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డులు అందుకొంది. మహేష్ బాబు హీరోగా చేసిన అర్జున్ లో ఆమె పోషించిన ఆండాళ్లు అనే విలన్ పాత్ర ఆమెకు నంది స్పెషల్ జ్యూరి అవార్డు తెచ్చిపెట్టింది.

గుంటూరులో జన్మించిన ఈ తెలుగమ్మాయి, బాలచందర్ మరోచరిత్రతో తెలుగు తెరమీద ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అప్పట్లో ఆమె సంచలనం సృష్టించింది. లెక్కకుమించిన సినిమాల్లో నటించినా, ఎన్నో అవార్డులు తెచ్చుకున్నా ఆమె వైవాహిక జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో నడిచింది. సరిత రెండు సార్లు పెళ్లిచేసుకుంది.

1975 లో తెలుగు రంగస్థలం నటుడు వెంకటసుబ్బయ్య ను పెళ్లిచేసుకుంది. పెళ్లై సంవత్సరం తిరగ్గానే అంటే 1976 లో ఆయన తో బంధం తెగతెంపులు చేసుకుంది. ఆ తర్వాత 1988 లో మలయాళ నటుడు ముఖేష్ ను పెళ్లిచేసుకుంది. వాళ్లకు శ్రావణ్ , తేజ అనే ఇద్దరు కొడుకులు . కొన్నాళ్ళకు వీరిద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తాయి. విడాకులు కోరుతూ ముఖేష్ చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వీరిద్దరికి 2007 లో విడాకులు మంజూరు చేసింది.

ఆ తర్వాత ముఖేష్ క్లాసికల్ డ్యాన్సరైన మెథిల్ దేవిక ను వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం చెల్లదని సరిత కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు తాను దుబాయిలో ఉన్నానని, కోర్టు ఇచ్చిన నోటీసులను తాను అందుకోలేదన్నారు. దీనితో తాను కోర్టుకు హాజరు కాలేకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసిందన్నారు.

కాబట్టి ముఖేష్ రెండో వివాహం చెల్లదంటూ తీర్పివ్వాలని కోర్టును సరిత అభ్యర్థించారు. విచారణ నిమిత్తం కోర్టుకు హజరైన సరిత కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయారు. కోర్టుకు ముఖేష్ కూడా హాజరయ్యారు. ఈ కేసు ఇంకా ఎర్నాకుళం ఫ్యామిలీ కోర్టులోనే ఉంది. సరిత ప్రస్తుతం తన ఇద్దరి కొడకులతోనూ దుబాయ్ లో ఉంటోంది. ముఖేష్ తన కొత్త ఫ్యామిలీతో ఎర్నాకుళంలో ఉంటున్నాడు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago