నిన్న శాసనమండలిలో ఒక వైపు వాడి వేడి చర్చ జరుగుతుంది, మరో వైపు టీడీపీ ఎం.ఎల్.ఏ. బాలకృష్ణ, వై.సి.పి. ఎం.ఎల్.ఏ రోజా నవ్వులు చిందిస్తూ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అది వర్మ కంట పడింది.. ఇంకేముంది తనదైన శైలిలో ట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. ఎవరిని వదలకుండా ట్రోల్ చేసే రాంగోపాల్ వర్మ రోజా-బాలయ్య సెల్ఫీని కూడా ట్విట్టర్ తనదైన ట్వీట్స్ రూపంలో ట్రోల్ చేసాడు.
అయితే రోజా చాలా అందంగా ఉందంటూనే, బాలకృష్ణ ను అయన ఎవరో తెలియదు అని, రోజా పక్కన దిష్టి బొమ్మలా ఉన్నాడని కామెంట్ చేసాడు. సెల్ఫీ లో రోజా గారు హీరో లా కనిపిస్తున్నారు కానీ ఆమె కుడి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరోగాని ఈ ఫ్రెమ్ లో రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నాడు. రోజా గారి పక్కన చాలా అసహ్యంగా ఉన్నాడు, బహుశా అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు అంటూ ట్వీట్ చేసాడు. అంతేకాదు కాసేపుఆగి మరో ట్వీట్ చేసాడు “అందమైన రోజా గారి పక్కన కూర్చుని ఫోటో నాశనం చేస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి ” అంటూ మరో ట్వీట్ చేసాడు. ఆర్.జి.వి. ట్వీట్స్ పై బాలయ్య ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…