భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా..అనే పాట ఈ నటుడిని చూడగానే గుర్తుకువస్తుంది. శివాజీ రాజా తండ్రి భీమవరం బి.ఎన్.ఆర్ కాలేజీలో అటెండర్ గా పనిచేసేవాడు.అదే కాలేజీలో శివాజీ రాజా చదువుకునే వాడు. కాలేజీకి సరిగా వెళ్లేవాడు కాదు. ఎన్.సి.సి ఆక్టివిటీస్ తో పాటుగా కాలేజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో చురుగ్గా పాల్గొనేవాడు. శ్రేయోభిలాషుల సలహా మేరకు ఆయన హైదరాబాద్ వెళ్లి మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ కావడం జరిగింది. నటనలో శిక్షణ పూర్తయిన తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. పాండీ బజార్ లో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం దర్శకులను కలుస్తూ ఉండేవాడు.
ప్రముఖ కమెడియన్ ఆలీ,శివాజీ రాజా కలిసి ఒకే గదిలో అద్దెకు ఉండేవారు. 1988 లో అసిస్టెంట్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణను శివాజీ రాజా కలిసినప్పుడు ఎం.వి.రఘు నూతన నటీనటులతో ఒక కొత్త సినిమా మొదలు పెడుతున్నారు.. దానికి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పడంతో శివాజీ రాజా ఆయనను కలవడం జరిగింది. అంతకుముందే గొల్లపూడి మారుతి రావు రాసిన కళ్ళు అనే నాటకాన్ని హైదరాబాదులో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శివాజీ రాజా ఇతర నటీనటులతో ఆ నాటకాన్ని వేయడం జరిగింది. అలా ఆడిషన్ లో ఉత్తమమైన నటనను ప్రదర్శించడం వలన అప్పటికే ఆ పాత్రకు ఎన్నికైన నటున్ని తొలగించి శివాజీ రాజాను పెట్టుకోవడం జరిగింది. అలా కళ్ళు సినిమాలో మొదటగా ఆయన నటించారు.
ఆ తర్వాత ఆయనకు యాక్సిడెంట్ కావడం వలన కొంత కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. శివాజీ రాజా కోలుకున్నాక.. హీరోగా అవకాశాలు రాలేదు. ఇంకా ఎక్కువ కాలం వేచి ఉండక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అలా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బొబ్బిలి రాజా సినిమాలో మొదటగా నటించారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో పేకాట పాపారావు,పెళ్లి సందడి పెళ్లి పీటలు, ప్రేమంటే ఇదేరా, జోకర్, నెంబర్ వన్, వినోదం, సిసింద్రీ, ఖడ్గం, సముద్రం, డాడీ, నిన్నే ప్రేమిస్తా, మురారి, ఇలా నటిస్తున్న అటువంటి క్రమంలో ప్రముఖ నటుడు రంగనాథ్ దర్శకత్వంలో మొగుడు పెళ్ళామ్స్ అనే చిత్రంలో శివాజీ రాజా హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలిపోయింది.
ఈ మధ్యకాలంలో జైసింహ, విరోధి, మెంటల్ మదిలో, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాల్లో నటించడం జరిగింది. శివాజీ రాజా తన కొడుకును సినిమా రంగంలో రాణించాలని.. వెయిట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, కె.రమాకాంత్ దర్శకత్వంలో వచ్చిన “ఏదైనా జరగవచ్చు”అనే సినిమాలో శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా, పూజ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా మామూలుగా ఆడడంతో..”వేయి శుభములు కలుగు నీకు”అనే కొత్త సినిమాలో విజయ్ రాజా నటిస్తున్నాడు. ఎంతో ఎనర్జిటిక్ ఈజ్ తో నటించే విజయ్ రాజాకు మంచి సినీ భవిష్యత్ ఉండాలని కోరుకుందాం.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…