రాజమండ్రి నుంచి ఎంతో మంది కళాకారులు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన వారు ఉన్నారు. ఎస్.వి. రంగారావు, అంజలిదేవి, రాజబాబు, రోజారమణి, ఆలీ వీరంతా రాజమండ్రికి చెందిన వారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా రాజమండ్రి కి చెందిన వారే. తండ్రి ఓ విలేఖరి. ఈమెకు ఐదు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో రోజా రమణి అద్భుతమైన నటనతో ఎస్వీ రంగారావు కూడా ఆశ్చర్య పరిచేలా చేసింది.
ఆ తర్వాత 12 సంవత్సరాల వయసులో.. చైల్డ్ ఆర్టిస్ట్ గా రోజారమణికి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ క్రమంలో వారి నాన్నగారు ఇక సినిమాలను విరమించుకోవాలి అనేసరికి రోజారమణికి ఎక్కడ లేని బాధ కలిగింది. అదే సమయంలో ఒక మలయాళం విలేకరి రోజా రమణి నాన్నగారి వద్దకు వచ్చినప్పుడు. కొత్తవాళ్లతో చంభారతి అనే మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్నారని రోజా రమణి అందులో హీరోయిన్ గా నటిస్తుందా అని అడిగాడు. అప్పటికి అటు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు ఇటు హీరోయిన్ కాదు అనే వయసులో.. హీరోయిన్ గా నటించడం ఏంటి అని రోజా రమణి ఆశ్చర్యపడింది. ఆ సినిమాలో డిగ్లామర్ రోల్ కావడంతో అంతగా ఇష్టం తో నటించనప్పటికీ.. చంబారతి అనే మలయాళం సినిమా కేరళలో ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత రోజా రమణికి దాదాపుగా 35 మలయాళ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.
అదే సినిమాను తెలుగులో ఓ.ఎస్.ఆర్. ఆంజనేయులు దర్శకత్వంలో లక్ష్మీకాంత్, రోజారమణి హీరో, హీరోయిన్లుగా “కన్నె వయసు” సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. “ఏ దివిలో విరిసిన పారిజాతమో…అనే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది. ఆ తర్వాత రోజారమణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘డ్రైవర్ రాముడు’ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటించింది. ఈ సినిమాలోని “ఏమని వర్ణించను…అనే అన్నా చెల్లెళ్ల పాట సినిమా విజయానికి మరో కారణం అయ్యింది.
ఆ తర్వాత నటుడు చక్రపాణిని పెళ్లి చేసుకొని హీరో తరుణ్ కు జన్మనివ్వడం తో సినిమాల్లో నటించడం మానుకుంది. కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్స్ కి దాదాపు నాలుగు వందలకు పైగా చిత్రాలకు తన వాయిస్ ని అందించింది. అయితే ఆమె తల్లి గారికి ఆ రోజుల్లో నెహ్రూ గారు అంటే చాలా అభిమానం ఉండేది. రోజా రమణి పుట్టడంతో నెహ్రూ కు ఇష్టమైన పువ్వు రోజా కావడంతో రోజా అనిపెట్టి తనకి ఇష్టమైన దైవం వెంకటరమణలోని రమణ కలిపి”రోజారమణి”అని పేరు పెట్టారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…